‘బ్రహ్మాస్త్ర’ కోసం షారుఖ్ - దీపిక
రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ తళుక్కున మెరవనున్నారు. ప్రస్తుతం హిందీ సి
రణ్బీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ స్టార్స్ తళుక్కున మెరవనున్నారు. ప్రస్తుతం హిందీ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో షారుక్ ఖాన్, దీపిక పదుకొణె అతిథి పాత్రలు పోషించినట్లు తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని.. వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం వినిపిస్తోంది. చిత్రంలో కీలక మలుపు సన్నివేశంలో షారుక్ మెరవనున్నట్లు తెలుస్తోంది. అస్త్రాలన్నిటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రం చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమిది. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాకి తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ అనే టైటిల్ ఖరారు చేశారు. దీన్ని దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ