‘బ్రహ్మాస్త్ర’ కోసం షారుఖ్‌ - దీపిక

రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వీరితో పాటు మరికొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ తళుక్కున మెరవనున్నారు. ప్రస్తుతం హిందీ సి

Published : 17 Jun 2022 02:04 IST

ణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ జంటగా అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో వీరితో పాటు మరికొందరు బాలీవుడ్‌ స్టార్స్‌ తళుక్కున మెరవనున్నారు. ప్రస్తుతం హిందీ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో షారుక్‌ ఖాన్‌, దీపిక పదుకొణె అతిథి పాత్రలు పోషించినట్లు తెలిసింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిందని.. వారి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ప్రచారం వినిపిస్తోంది. చిత్రంలో కీలక మలుపు సన్నివేశంలో షారుక్‌ మెరవనున్నట్లు తెలుస్తోంది. అస్త్రాలన్నిటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రం చుట్టూ తిరిగే కథతో రూపొందిన చిత్రమిది. మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. ఈ సినిమాకి తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీన్ని దర్శకుడు రాజమౌళి సమర్పిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని