Balakrishna: బాలకృష్ణకి కరోనా పాజిటివ్‌

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కరోనా బారిన పడ్డారు. ఇటీవల చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Updated : 25 Jun 2022 08:13 IST

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (Balakrishna) కరోనా(Corona) బారిన పడ్డారు. ఇటీవల చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, గత రెండు రోజులుగా తనని కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఆయన ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని(Gopichand Malineni) దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉండగా, ఆయన కరోనాతో అస్వస్థకి గురయ్యారు.

సమన్వయ కమిటీ చర్చలు మొదలు
సినీ కార్మికుల వేతనాలకి సంబంధించి ఫిలిం ఛాంబర్‌(Telugu Film Chamber)
ఆధ్వర్యంలో ఏర్పాటైన సమన్వయ కమిటీ శుక్రవారం చర్చలు మొదలుపెట్టింది. దిల్‌రాజు(DilRaju) నేతృత్వంలో కొద్దిమంది నిర్మాతలు, కార్మిక సంఘాల నాయకుల సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. కార్మికులు డిమాండ్‌ చేస్తున్న వేతనాల పెంపు సాధ్యాసాధ్యాలు, నిర్మాతల సాధకబాధకాలు మొదలుకొని విధి విధానాల అమలు వరకు పలు విషయాల్ని చర్చించినట్టు సమావేశానికి హాజరైన ఓ నిర్మాత తెలిపారు. మరికొన్ని రోజులపాటు ఈ చర్చలు కొనసాగనున్నాయి. సమన్వయ కమిటీకి నేతృత్వం వహిస్తున్న దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు నిర్మాతలు, కార్మిక సంఘాల నాయకులు కలిసి మాట్లాడుకున్నాం. ఏ రోజు ఏం మాట్లాడుకున్నామో, చివరిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో త్వరలోనే తెలియజేస్తాం. చిత్రీకరణలు యథావిధిగా జరుగుతున్నాయ’’ని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని