My Dear Bootham: మై డియర్‌ మాస్టర్‌

ప్రభుదేవా కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఎన్‌.రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 25 Jun 2022 08:27 IST

ప్రభుదేవా(Prabhudeva) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మై డియర్‌ భూతం’ (My Dear Bootham). ఎన్‌.రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్‌.పి పిళ్లై నిర్మిస్తున్న ఈ సినిమాని తెలుగులో ఏఎన్‌ బాలాజీ విడుదల చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమాలోని తొలి పాటని విడుదల చేశారు. మాస్టర్‌ ఓ మై మాస్టర్‌...’ అంటూ సాగే ఈ పాటని ఇమ్మాన్‌ స్వరపరచగా, చల్లా భాగ్యలక్ష్మి రచించారు. అరవింద్‌ అన్నెస్ట్‌ ఆలపించారు. ఇందులో జీనీగా నటిస్తున్నారు ప్రభుదేవా. జీనీకి, పిల్లలకీ మధ్య జరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోందని, ప్రభుదేవా తన నటనతోనూ, డ్యాన్స్‌తోనూ అలరిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో రమ్య నంబీశన్‌ కీలక పాత్ర పోషించారు. సంయుక్త, ఇమ్మాన్‌ అన్నాచి, తదితరులు నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని