Tollywood: మరో కథ సిద్ధం!

వరుణ్‌తేజ్‌ ఈమధ్యే ‘ఎఫ్‌3’తో సందడి చేశాడు. ఇక ఆయన దృష్టంతా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెర కెక్కుతున్న కొత్త చిత్రంపైనే. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న సినిమా అది. ఆ తర్వాత వరుణ్‌ చేయనున్న సినిమా కోసం మరో కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ కథని యు

Updated : 27 Jun 2022 06:53 IST

రుణ్‌తేజ్‌ (Varuntej) ఈమధ్యే ‘ఎఫ్‌3’తో(F3) సందడి చేశాడు. ఇక ఆయన దృష్టంతా ప్రవీణ్‌ సత్తారు(Praveen Sattaru) దర్శకత్వంలో తెర కెక్కుతున్న కొత్త చిత్రంపైనే. యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న సినిమా అది. ఆ తర్వాత వరుణ్‌ చేయనున్న సినిమా కోసం మరో కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆ కథని యువ దర్శకుడు సుజీత్‌(Sujeeth) సిద్ధం చేశారు. ప్రభాస్‌తో ‘సాహో’(Saaho) తెరకెక్కించిన దర్శకుడు సుజీత్‌. ఆ చిత్రం తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు. వరుణ్‌తో కలిసే రంగంలోకి దిగుతారని సమాచారం. మరి ఈ కలయికలో ఈసారి ఎలాంటి సినిమా వస్తుందనేది చూడాలి.


పంచతంత్రం

ఐదు కథల సమాహారంగా మా ‘పంచతంత్ర కథలు’ (panchatantra kathalu) చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలిపారు గంగనమోని శేఖర్‌. ఆయన దర్శకత్వంలో, డి.మధు నిర్మిస్తున్న చిత్రమిది. నోయెల్‌, నందినిరాయ్‌, సాయిరోనక్‌, గీత భాస్కర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలోని ‘నేనేమో మోతేవరి...’ అంటూ సాగే పాటని ప్రముఖ దర్శకుడు తరుణ్‌భాస్కర్‌(Tharun Bhascker) విడుదల చేశారు. ఈ పాటకి కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా, సంగీత దర్శకుడు కమ్రాన్‌ స్వరపరిచారు. రామ్‌ మిరియాల(Ram Miriyala) ఆలపించారు. దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘ఇది నాకు ఇష్టమైన పాట. తప్పకుండా వైరల్‌ అవుతుంది. దర్శకుడు శేఖర్‌ మేకింగ్‌, విజువల్స్‌ చాలా బాగున్నాయి. ఇందులో మా అమ్మ నటించారు. ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ప్రణీత పట్నాయక్‌, నిహాల్‌ కోదర్తి, సాదియ, అజయ్‌ కతుర్వర్‌ తదితరులు నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని