Swathimuthyam: నీ చారెడు కళ్లే చదివేస్తూ...

బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌.కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలోని ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా... నీ మత్తులో మళ్లీ పడి లేస్తూ ఉన్నా...

Updated : 28 Jun 2022 13:56 IST

బెల్లంకొండ గణేశ్‌, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్‌.కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రంలోని ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా... నీ మత్తులో మళ్లీ పడి లేస్తూ ఉన్నా...’ అంటూ సాగే పాటని సోమవారం విడుదల చేశారు. కె.కె. రచించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, సంజన కాలమంజే ఆలపించారు. మహతి స్వరసాగర్‌ స్వరాలు సమకూర్చారు. ‘‘ప్రేమ, హాస్యం మేళవింపుగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రమిది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా దర్శకుడు తెరకెక్కించారు. తాజాగా విడుదలైన ప్రేమ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. గణేశ్‌ నృత్య రీతులు సమకూర్చిన ఈ పాట తెరపై ఇంకా బాగుంటుంది. ఇందులో అన్ని పాటలూ మనసుల్ని హత్తుకునేలా ఉంటాయ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. నరేష్‌, రావు రమేష్‌, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, సప్తగిరి, హర్షవర్ధన్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సూర్య.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు