కలల చిత్రం.. కళగా మార్చాలని ..!
కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవడానికే అకుంఠిత దీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలా శ్రమించి తమ కలల్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. ఇక సినీ ప్రపంచంలో కలలన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. అందుకే ఇక్కడ తమ కలల చిత్రాల్ని సాకారం చేసుకోవడానికి ఎంత పెద్ద దర్శకుడైనా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించక తప్పదు.
కలలు కనడం సులభమే. వాటిని సాకారం చేసుకోవడానికే అకుంఠిత దీక్షతో శ్రమించాల్సి ఉంటుంది. ఇలా శ్రమించి తమ కలల్ని నిజం చేసుకునే వారు కొందరే ఉంటారు. ఇక సినీ ప్రపంచంలో కలలన్నీ ఖరీదైనవిగానే ఉంటాయి. అందుకే ఇక్కడ తమ కలల చిత్రాల్ని సాకారం చేసుకోవడానికి ఎంత పెద్ద దర్శకుడైనా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించక తప్పదు. జయాపజయాలు.. ఇమేజ్ లెక్కలు.. బడ్జెట్ తిప్పలు.. ఇలా బోలెడన్ని చిక్కులు దాటొస్తే గానీ కలల సినిమా... చిత్ర కళగా కార్యరూపంలోకి రాదు. ఇప్పుడిలాంటి ఒడుదొడుకులన్నీ దాటుకొని.. తమ డ్రీమ్ ప్రాజెక్ట్లను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్ధమవుతున్నారు పలువురు దర్శకులు. మరి వారెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
మణిరత్నం కల
‘నాయకుడు’, ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’, ‘ఇద్దరు’.. ఇలా భారతీయ సినీప్రియులకు ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన దర్శకుడు మణిరత్నం. ఇప్పుడాయన నుంచి రానున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. ఇది మణిరత్నం కలల సినిమా. ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా రూపొందింది. చోళుల కాలం నాటి ఆసక్తికర కథాంశంతో పీరియాడికల్ సినిమాగా ముస్తాబవుతోంది. మణిరత్నం గతంలో ఎన్నోసార్లు ఈ చిత్రాన్ని పట్టాలెక్కించాలని ప్రయత్నించారు. బడ్జెట్ సమస్యల వల్ల అతి కార్యరూపం దాల్చలేదు. అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్బాబును సంప్రదించినట్లూ వార్తలు వినిపించాయి. అయితే భాగస్వామ్య పద్ధతిలో ఈ సినిమా నిర్మించేందుకు లైకా సంస్థ ముందుకు రావడంతో.. మూడేళ్ల క్రితం ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పట్టాలెక్కింది. ఇప్పుడు దీన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న తొలి భాగం.. ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇందులో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దాదాపు రూ.500కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
కమల్ జోరు..
‘విక్రమ్’తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు కథానాయకుడు కమల్హాసన్. ఇప్పుడీ జోష్లోనే ఇన్నాళ్లు అటకెక్కిన తన కలల ప్రాజెక్టుల్ని ఒకొక్కటిగా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్స్లో ‘మరుదనాయగం’, ‘మర్మయోగి’ సినిమాలతో పాటు ‘శభాష్ నాయుడు’ అనే మరో చిత్రం ఉన్న సంగతి తెలిసిందే. ‘దశావతారం’లోని బలరామ్ నాయుడు పాత్ర ఆధారంగా ఈ కథని తీర్చిదిద్దారు. 2016లో సెట్స్పైకి వెళ్లిన ఈ సినిమా.. ఆ తర్వాత బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని కమల్ తిరిగి పట్టాలెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. దీన్ని ఆయన తన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన తనయ శ్రుతిహాసన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘భారతీయుడు2’ పూర్తయిన వెంటనే ఇది సెట్స్పైకి వెళ్లనుందని ప్రచారం వినిపిస్తోంది.
పూరి.. ‘జనగణమన’
దర్శకుడు పూరి జగన్నాథ్ కలల చిత్రమనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘జన గణమన’. ఈ సినిమాని అప్పట్లో మహేష్బాబుతో పట్టాలెక్కించాలని ప్రయత్నించారు పూరి. ‘పోకిరి’, ‘బిజినెస్మ్యాన్’ వంటి విజయాల తర్వాత వీరి కలయికలో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఆరోజుల్లో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత ఈ కథను వెంకటేష్కు వినిపించినట్లు వార్తలు వినిపించాయి. అదీ నిజం కాలేదు. పూరి ఎట్టకేలకు తన కలల చిత్రాన్ని విజయ్ దేవరకొండతో పట్టాలెక్కించనున్నారు. దీన్ని ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్మీ నేపథ్యంలో సాగే హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రమిది. ముంబయితో పాటు విదేశాల్లోనూ చిత్రీకరణ జరపనున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం విజయ్తో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘లైగర్’ విడుదలకు సిద్ధమవుతోంది.
‘మహాభారతం’ ఊరిస్తోంది
‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి విజయవంతమైన చిత్రాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఆయన చిరకాల స్వప్నం ‘మహాభారతం’ సినిమా. కచ్చితంగా ఆ చిత్రం పట్టాలెక్కిస్తానని ఆయన ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు. అయితే దానికి మరింత సమయం పడుతుందని, ఇంకా ఎంతో అనుభవం సంపాదించాల్సి ఉందని పలు వేదికలపై తెలిపారు. ఆ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కినా.. అది చరిత్రలో చిరకాలం నిలిచిపోయేలా ఉంటుందని, దేశంలోని అగ్రతారలంతా అందులో నటిస్తారని ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. అందుకే ఈ ప్రాజెక్ట్పై ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుుడు పృథ్వీరాజ్ సుకుమార్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం