Tollywood: అందరి గురి సంక్రాంతి బరి
ముగిసింది వేసవి సీజనే. జులైలో బాక్సాఫీసుకి విరామం లేకుండా వరుస కడుతున్నాయి కొత్త సినిమాలు. ఆ తర్వాత దసరా, దీపావళి చిత్రాలు ఉండనే ఉంటాయి. వాటి సందడి ఇంకా షురూ అవ్వనే లేదు. అప్పుడే చిత్రసీమ సంక్రాంతిపై గురి పెట్టింది. పెద్ద పండగ తీసుకొస్తున్న పెద్ద సీజన్
ముగిసింది వేసవి సీజనే. జులైలో బాక్సాఫీసుకి విరామం లేకుండా వరుస కడుతున్నాయి కొత్త సినిమాలు. ఆ తర్వాత దసరా, దీపావళి చిత్రాలు ఉండనే ఉంటాయి. వాటి సందడి ఇంకా షురూ అవ్వనే లేదు. అప్పుడే చిత్రసీమ సంక్రాంతిపై (Sankranthi) గురి పెట్టింది. పెద్ద పండగ తీసుకొస్తున్న పెద్ద సీజన్ కోసం వరుసగా కట్చీఫ్ వేసేస్తున్నాయి సినిమాలు. మరికొంతమంది నిర్మాతలు మనకీ బెర్తు దొరక్కపోతుందా? అంటూ నిశితంగా గమనిస్తున్నారు.
తెలుగులో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు నాలుగే. వీటి మధ్యలో ఒకట్రెండు చిన్న సినిమాలకీ చోటు దక్కే అవకాశాలు ఉంటాయి. పోటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అగ్ర కథానాయకుల చిత్రాలు నువ్వా నేనా అన్నట్టుగా సంక్రాంతి రేసులోకి వస్తుంటాయి. నిర్మాణంలో జాప్యం వల్లో... నిర్మాణానంతర పనులు పూర్తి కాలేదనో... ఇలా చాలా సినిమాలు మధ్యలోనే వెనకడుగు వేస్తుంటాయి. కొన్నిసార్లు ఎవ్వరూ ఊహించనివి సంక్రాంతి బరిలోకి దిగుతుంటాయి. రెండేళ్లుగా అదే జరిగింది. 2023 సంక్రాంతికి పక్కాగా వచ్చే సినిమాలేవనేది చెప్పలేం కానీ... ఇప్పటికి వచ్చేస్తున్నాం అని ఖరారు చేసినవి నాలుగు. చిరంజీవి 154వ చిత్రం, ప్రభాస్ ‘ఆదిపురుష్’, (Adipurush) విజయ్ ‘వారసుడు’, (Varasudu) పంజా వైష్ణవ్తేజ్ (Vaishnav Tej) కొత్త చిత్రం... ఇలా ఈ నాలుగూ పండగకొస్తున్నట్టుగా పోస్టర్లతో చెప్పేశాయి.
తనయుడి చిత్రం కాదని...
రామ్చరణ్ (RamCharan) - శంకర్ (Shankar) (RC15) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి లక్ష్యంగా చిత్రీకరణ సాగింది. నిర్మాత దిల్రాజు (Dilraju) సంక్రాంతికి తీసుకొస్తామని పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడీ చిత్రం ఆ రేసు నుంచి దాదాపుగా వైదొలగినట్టే. బాబీ (Bobby) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి (Chiranjeevi) 154వ (Chiru 154) చిత్రం సంక్రాంతి బరిలో దిగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమది. ఇటీవలే ఆ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తున్నాం అని ప్రకటించారు నిర్మాతలు. దిల్రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘వారసుడు’ (Varasudu) సంక్రాంతికి విడుదల ఖరారైంది. విజయ్ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెర కెక్కుతున్న చిత్రమిది.
ఆ రెండూ...
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్’ (Adipurush). మోషన్ క్యాప్చర్ సాంకేతితతో రూపొందుతున్న ఈ సినిమా 12 జనవరి 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ (Omraut) తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తారు. సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణుడిగా నటించారు. కృతిసనన్, సన్నీసింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైష్ణవ్తేజ్ (Vaishnav Tej) కథానాయకుడిగా శ్రీకాంత్రెడ్డి అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమా సంక్రాంతికే విడుదలవుతుంది. ఆ మేరకు చిత్రబృందం పోస్టర్తోపాటుగా విడుదల విషయాన్ని ప్రకటించింది. అగ్ర తారలు నటిస్తున్న మరికొన్ని సినిమాలూ సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. బయటికి ప్రకటించకపోయినా ఆలోపు అన్ని పనులూ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలనే లక్ష్యంతో ముస్తాబవుతున్నాయి. మధ్యలో ఏ సినిమా రేసు నుంచి తప్పుకొన్నా వాటి స్థానంలో కొత్త చిత్రాలు బరిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు