Anushka Sharma: ఎక్స్ప్రెస్ వేగంతో..
నాలుగేళ్ల క్రితం ‘జీరో’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది నటి అనుష్క శర్మ. ఆ తర్వాత నిర్మాతగా కొన్ని ప్రాజెక్ట్లు నిర్మించినా.. నటిగా తెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడామె ‘చక్దా ఎక్స్ప్రెస్’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. భారత మహిళా క్రికెటర్
నాలుగేళ్ల క్రితం ‘జీరో’ (Zero) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది నటి అనుష్క శర్మ (Anushka Sharma). ఆ తర్వాత నిర్మాతగా కొన్ని ప్రాజెక్ట్లు నిర్మించినా.. నటిగా తెరపై కనిపించలేదు. అయితే ఇప్పుడామె ‘చక్దా ఎక్స్ప్రెస్’తో (Chakdaha Express) అలరించేందుకు సిద్ధమవుతోంది. భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి(Jhulan Goswami) జీవిత కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రోసిత్ రాయ్ తెరకెక్కిస్తున్నారు. కర్నేష్ శర్మ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయినట్లు అనుష్క సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. త్వరలో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. ఈ సినిమాలో ప్రొఫెషనల్ క్రికెటర్గా కనిపించడం కోసం ఆమె ప్రత్యేకంగా సిద్ధమైంది. ఓ కోచ్ను నియమించుకొని బ్యాటింగ్, బౌలింగ్లలో కఠిన శిక్షణ తీసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది నెట్ఫ్లిక్స్లో విడుదల కానున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!