సమంత పాత్రధారిగా..

తన సినీ కెరీర్‌ను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టిస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘యశోద’, ‘ఖుషీ’ సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి...

Published : 05 Jul 2022 06:02 IST

తన సినీ కెరీర్‌ను జెట్‌ స్పీడ్‌తో పరుగులు పెట్టిస్తోంది నటి సమంత. ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘యశోద’, ‘ఖుషీ’ సినిమాలు సెట్స్‌పై ముస్తాబవుతున్నాయి. కాగా, ఇప్పుడామె నుంచి మరో కొత్త కబురు అందింది. నటి తాప్సీ నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్‌ చేయనుంది. ఈ విషయాన్ని తాప్సీ ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. ‘‘సమంత నేను కలిసి పనిచేయనున్నాం. ఆ ప్రాజెక్ట్‌ను త్వరలో ప్రకటిస్తాం. అందులో తనే ప్రధాన పాత్ర పోషిస్తుంది. నేను నిర్మాతగా వ్యవహరిస్తా. ఒకవేళ దాంట్లో నేను చేయగలిగే భాగం ఏదైనా ఉంటే కచ్చితంగా చేస్తాను. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్‌ నిర్మించడం పట్ల ఉత్సాహంగా ఉన్నా’’ అని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘శభాష్‌ మిథూ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని