Karthi: నమ్మినబంటు.. ‘వంథియ దేవన్‌’

విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష ప్రధాన పాత్రధారులుగా అగ్ర దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నారు.

Updated : 06 Jul 2022 14:25 IST

విక్రమ్‌ (Vikram), కార్తి (karthi), జయం రవి (Jayam ravi), ఐశ్వర్య రాయ్‌ (Aishwarya Rai Bachchan), త్రిష(Trisha) ప్రధాన పాత్రధారులుగా అగ్ర దర్శకుడు మణిరత్నం(maniratnam) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ (ponniyin selvan). రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగాన్ని సెప్టెంబర్‌ 30న విడుదల చేయనున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం కార్తి లుక్‌ని విడుదల చేశారు. ఇందులో కార్తి వంథియ దేవన్‌ పాత్రలో   కనిపించనున్నారు. వంథియదేవన్‌ చోళ సామ్రాజ్యంలోని రాజు ఆదిత్య కరికాలన్‌, ఆయన కుటుంబానికి నమ్మినబంటుగా పని చేస్తుంటారు. నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు పోస్టర్‌ విడుదల చేస్తూ.. ‘రాజ్యం లేని యువరాజు, గూఢచారి, పరాక్రమవంతుడే ఈ వంథియ దేవన్‌’   అనే నినాదం జోడించాయి. ఈ  సినిమాకి సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: తోట తరణి, ఛాయాగ్రహణం: రవి వర్మన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని