Gowtham raju: కూర్పు కళలో రారాజు
రూపు తెరపై కనిపించకున్నా.. ఆ పేరెప్పుడూ సినీప్రియులకు సుపరిచితమే. కూర్పు కళలో స్టార్. తెరపై కనిపించని హీరో. ఎడిటింగ్ అంటే కత్తెరతో ఫ్రేమ్స్ కట్ చేయడమే కాదని.. ఏది కట్ చేయాలో.. ఏది కంటిన్యూ చేయాలో.. ఆర్డర్ మార్పులతో ఓ కథని ఎంత కొత్తగా, అందంగా చెప్పొచ్చో
ఎడిటర్ గౌతంరాజు ఇకలేరు
ఎడిటింగ్.. గౌతంరాజు... రూపు తెరపై కనిపించకున్నా.. ఆ పేరెప్పుడూ సినీప్రియులకు సుపరిచితమే. కూర్పు కళలో స్టార్. తెరపై కనిపించని హీరో. ఎడిటింగ్ అంటే కత్తెరతో ఫ్రేమ్స్ కట్ చేయడమే కాదని.. ఏది కట్ చేయాలో.. ఏది కంటిన్యూ చేయాలో.. ఆర్డర్ మార్పులతో ఓ కథని ఎంత కొత్తగా, అందంగా చెప్పొచ్చో.. సూటిగా సుత్తి లేకుండా ప్రేక్షకుల్ని ఎలా రంజింపచేయొచ్చో.. విజయవంతంగా చేసి చూపిన కళా మాంత్రికుడాయన. ఎడిటింగ్ టేబుల్పైనే చిత్ర ఫలితాల్ని చెక్కగలిగిన.. చెప్పగలిగిన మేధావి. అందుకే స్టార్ హీరోల తొలి ఛాయిస్ ఎప్పుడూ ఆయనే. ఇప్పుడా కూర్పు కళా శిల్పి చిత్రసీమను, కళాభిమానుల్ని విషాదంలోకి నెట్టేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు(68) (Gowtham Raju) కన్నుమూశారు. కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన తన మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో 850పైగా చిత్రాలకు ఎడిటర్గా పని చేసి.. చిత్రసీమపై చెరగని ముద్ర వేశారు. అగ్ర హీరో.. కుర్ర హీరో అని తేడాల్లేకుండా పరిశ్రమలోనే అందరి చిత్రాలకు పని చేశారు. ఎన్నో బ్లాక్బస్టర్లలో కీలక భాగస్వామి అయ్యారు. గౌతంరాజుకు భార్య రత్నమాణిక్యం, ఇద్దరమ్మాయిలు ఉన్నారు. ఆయన అంత్యక్రియల్ని పెద్దల్లుడు రామకృష్ణ బుధవారం హైదరాబాద్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. దీనికి నటుడు మోహన్బాబు(Mohanbabu), దర్శకుడు వి.వి.వినాయక్(VV Vinayak) తదితరులు హాజరై నివాళులర్పించారు.
సినిమా ఆపరేటర్గా మొదలై..
తెల్లచొక్కా.. జులపాల జుట్టుతో చిరునవ్వులు చిందిస్తూ మౌన మునిలా కనిపించే గౌతంరాజు.. 1954 జనవరి 15న ఒంగోలులోని ఓ సామాన్య కుటుంబంలో పతి రంగయ్య, కోదనాయకి దంపతులకు జన్మించారు. ఆర్థిక సమస్యల వల్ల బి.ఎ.తో చదువు ఆపేసిన ఆయన.. ఆ తర్వాత ఓ వ్యక్తి సలహాతో అరుణాచలం స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్లో ఆపరేటర్గా అప్రెంటిస్గా చేరారు. ఇక్కడే ఆయనకి సినిమాతో పరిచయం పెరిగింది. ఏడాది తర్వాత తమిళ నటుడు రాజేంద్రకు చెందిన ‘రాజేంద్ర టూరింగ్ టాకీస్’లో ఆపరేటర్గా చేరి లైసెన్స్ పొందారు. ఇదే సమయంలో ఎడిటర్ దండపాణి ప్రోత్సాహంతో అసిస్టెంట్ ఎడిటర్గా చేరి.. సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు గౌతంరాజు. ఇదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది.
తొలి అడుగు తమిళ చిత్రసీమలోనే..
అసిస్టెంట్ ఎడిటర్గానే ఏడాదిలో 30కి పైగా చిత్రాలకు పని చేసి, ప్రతిభ చూపిన గౌతంరాజు.. ‘అవల్ ఓరు పచ్చికొళందై’ (Aval Oru Pachai Kulanthai) చిత్రంతో తొలిసారి పూర్తిస్థాయి ఎడిటర్గా మారారు. తమిళ స్టార్ విజయ్ (Vijay) తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తెరకెక్కించిన చిత్రమిది. ఆయనే తెలుగులో చిరంజీవితో ‘సట్టం ఒరు ఇరుత్తరై’(Sattam Oru Iruttarai) అనే తమిళ చిత్రాన్ని ‘చట్టానికి కళ్లులేవు’ (Chattaniki Kallu Levu) పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకూ ఎడిటర్గా పరిచయమయ్యారు. ఇక అక్కడి నుంచి తెలుగులోనే వరుస అవకాశాలు అందుకుంటూ.. మంచి ఎడిటర్గా గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోల నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి ఈతరం స్టార్ల వరకు అందరి చిత్రాలకు ఎడిటర్గా పనిచేసి మెప్పించారు. ఇటీవల కాలంలో ‘రేసుగుర్రం’, ‘గోపాల గోపాల’, ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘గబ్బర్ సింగ్’, ‘అల్లుడు శీను’, ‘అదుర్స్’, ‘కిక్’, ‘ఖైదీ నంబర్ 150’, ‘పవర్’, ‘బెంగాల్ టైగర్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సన్నాఫ్ ఇండియా’ వంటి చిత్రాలకు ఎడిటర్గా వ్యవహరించారు. ప్రస్తుతం ‘శాసన సభ’ (Shasana Sabha) అనే చిత్రానికి పనిచేస్తున్నా.. అదింకా పూర్తి కాలేదని తెలిసింది.
అందుకే ఆయన ప్రత్యేకం..
‘‘ప్రసవం చేసే గైనకాలజిస్ట్ తల్లి అరుపులను, రక్తస్రావాన్ని చీదరించుకుంటే ఎంత తప్పో.. ఎడిటర్ అనే వాడు ఎడిట్ చేసే సినిమాని చెత్తగానో, బోర్గానో ఫీలవడం అంతే తప్పు.
అది వృత్తి ద్రోహం.. దైవ దూషణతో సమానం’ అనేవారు గౌతంరాజు. కళ పట్ల, వృత్తి పట్ల ఆయనకున్న గౌరవం, నిబద్ధతకు ఈ మాటలే నిదర్శనం. ప్రతి చిత్ర విషయంలోనూ ఆయన ఈ మాటల్నే అనుసరించి పనిచేసేవారు. ఎడిటింగ్లో తెలుగు సినిమాకి ఎన్నో కొత్త పాఠాలు నేర్పించారాయన. ఆర్డర్ మార్పులతో రొటీన్ కథకు కొత్తదనం ఎలా అద్దొచ్చో.. సీన్లలో చిన్నపాటి మార్పులతో సినిమా వేగం ఎలా పెంచొచ్చో.. చేసి చూపించారాయన. కాలంతో పాటు మారిన సాంకేతిక మార్పుల్ని అందిపుచ్చుకుంటూనే.. ఎడిటింగ్కు తనదైన టెక్నిక్ జత చేసి కొత్త సొబగులు అద్దారు. అందుకే ఆయనతో పనిచేయడం కోసం స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపేవారు. ప్రస్తుతం చిత్రసీమలో మెరుపులు మెరిపిస్తున్న చాలా మంది ఎడిటర్లకు ఆయనే గురువు. గౌతంరాజు... తన ఆయుష్షును ఇంకాస్త కూర్పు చేసుకొని మరికొంత కాలం ఈ రంగంలో రాణించాలనుకునే ఔత్సాహికులకు మార్గదర్శిగా నిలిస్తే బాగుండేదని పరిశ్రమ కన్నీరు పెడుతోంది.
ఆరు నంది అవార్డులు..
గౌతంరాజు ఎడిటర్గా తెలుగులో ఏకంగా ఆరు నంది అవార్డులు అందుకున్నారు. 1984లో ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (Srivariki Premalekha) చిత్రానికి గానూ తొలిసారి నంది అవార్డు అందుకున్న ఆయన.. తర్వాత ‘మయూరి’ (Mayuri), ‘హై హై నాయకా’ (Hai Hai Nayaka), ‘చందమామరావే’ (Chandamama Raave), ‘భారతనారి’ (Bharatha Nari), ‘ఆది’ (Aadi) సినిమాలకు అవార్డులు దక్కించుకున్నారు. 89లో ‘కృష్ణా నీకొనిదాగ’ అనే కన్నడ చిత్రానికి బెస్ట్ ఎడిటర్గా కర్ణాటక స్టేట్ అవార్డు అందుకున్నారు. ‘రణం’ (Ranam) చిత్రానికి గానూ భరతముని పురస్కారం దక్కింది.
లోపలికి రానివ్వొద్దన్న గురువు
తన జీవితంలో ఒకే ఒక్కసారి తీవ్రంగా బాధపడ్డానన్నారు ఎడిటర్ గౌతంరాజు. ఆ సంఘటనని ఓ సందర్భంలో పంచుకున్నారాయన. ‘‘నా తొలి గురువు దండపాణి.. మలి గురువు సంజీవి. ఇక మూడో గురువు ఎడిటర్గా నాకు తొలి అవకాశం ఇచ్చిన ఎస్.ఏ.చంద్రశేఖర్. అయితే ఎడిటర్గా తొలి అవకాశం అందుకొని నేను బయటకు వెళ్తున్నప్పుడు సంజీవి నాపై చాలా కోప్పడ్డారు. ‘గౌతంరాజు వస్తే లోపలికి రానివ్వొద్ద’ని తన సిబ్బందితో అన్నారు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. నా జీవితంలో నేను తీవ్రంగా హర్ట్ అయిన సందర్భం అదొక్కటే. ఆయనే తను తీసిన ఒక ఒరియా చిత్రాన్ని నాకిచ్చి ఎడిట్ చేసి ఇవ్వమన్నారు. అప్పుడు అర్థం అయింది.. ఆయన కోపం తాత్కాలికమని, సహజమైనదని. నన్ను లోపలికి రానివ్వొద్దని చెప్పిన నా గురువు నాకు సినిమా ఇవ్వడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అని ఆనాటి సంఘటనని గుర్తుచేసుకున్నారు.
వాడి.. వేగం.. ప్రత్యేకం
‘చట్టానికి కళ్లు లేవు’ (Chattaniki Kallu Levu) నుంచి ‘ఖైదీ నెంబర్ 150’ (khaidi no 150) వరకు నేను నటించిన ఎన్నో చిత్రాలకు ఎడిటర్గా పనిచేసిన గౌతంరాజు మరణం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). గౌతంరాజు లాంటి గొప్ప ఎడిటర్ను కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన చాలా సౌమ్యుడైనా.. ఎడిటింగ్ చాలా వాడిగా ఉంటుందని, మితభాషి అయినప్పటికీ ఎడిటింగ్ మెళకువలు అపరిమితమని, ఎంత నెమ్మదస్తుడో.. ఆయన ఎడిటింగ్ అంత వేగమని గౌతంరాజు ప్రతిభను కొనియాడారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ.. తక్షణ సాయం కింద రూ.2లక్షలు అందజేశారు.
* ‘‘ఎడిటర్గా గౌతంరాజు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం’’ అన్నారు హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna). ‘‘గౌతంరాజు నాకెంతో ఆత్మీయులు. మృధు స్వభావి. అనేక విజయవంతమైన సినిమాలకు కలిసి పనిచేశాం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరమ’ని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
* ‘‘తెలుగు చిత్రసీమలో ఎడిటర్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన గౌతంరాజు కన్నుమూయడం విచారకరం. నేను నటించిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు ఆయన ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్విటర్ వేదికగా సంతాపం తెలియజేశారు నటుడు, జనసేనాధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan).
* గౌతంరాజు అకాల మరణం చెందడం తననెంతో బాధించిందన్నారు ఎన్టీఆర్. తాను చేసిన పలు సినిమాలకు ఆయన ఎడిటర్గా పనిచేశారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. ఇలా పలువురు సినీప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు