My Dear Bootham: ప్రియమైన భూతం వచ్చేస్తోంది

ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఎన్‌.రాఘవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’. ఏఎన్‌ బాలాజీ నిర్మాత. రమ్య నంబీశన్‌, అశ్వత్‌, పరం గుహనేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 07 Jul 2022 11:46 IST

ప్రభుదేవా (Prabhudeva) ప్రధాన పాత్రలో ఎన్‌.రాఘవన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మై డియర్‌ భూతం’ (My Dear Bootham). ఏఎన్‌ బాలాజీ నిర్మాత. రమ్య నంబీశన్‌, అశ్వత్‌, పరం గుహనేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జులై 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వైవిధ్యభరితమైన కథతో కిడ్స్‌ ఫాంటసీ చిత్రంగా దీన్ని ముస్తాబు చేశాం.  గ్రాఫిక్స్‌తో పాటు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రభుదేవా స్టైలిష్‌గా కనిపించడమే కాక.. కాస్త థ్రిల్‌ పంచనున్నార’’న్నారు. ఈ చిత్రానికి డి.ఇమ్మాన్‌ స్వరాలందించారు. యు.కె.సెంథిల్‌ కుమార్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని