Cinema News: సమాజానికి ఉపయోగపడేలా

రఘు కుంచే ప్రధాన పాత్రలో పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. అజయ్‌, సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు

Updated : 07 Jul 2022 11:44 IST

రఘు కుంచే ప్రధాన పాత్రలో పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్‌’. చదలవాడ శ్రీనివాసరావు నిర్మించారు. అజయ్‌, సుబ్బరాజు, ఎల్‌.బి.శ్రీరామ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘నక్సల్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఒక అద్భుతమైన తండ్రీ కొడుకుల కథే ఈ చిత్రం. ఇది ప్రతి ప్రేక్షకుడి మనసుని హత్తుకుంటుంది’’ అన్నారు. ‘‘మా చిత్ర పాటలు, ట్రైలర్‌ బాగున్నాయని అందరూ అంటున్నారు. సునీల్‌ కుమార్‌తో మరిన్ని చిత్రాలు చేస్తా’’ అన్నారు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. దర్శకుడు అజయ్‌ మాట్లాడుతూ.. ‘‘సమాజానికి ఉపయోగపడే చిత్రమిది. ఇందులో ప్రతి డైలాగ్‌ ఆణిముత్యంలా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని