Vikram: ఆయనకి ఇప్పటిదాకా థ్యాంక్ యూ చెప్పలేదు!
విక్రమ్ కె.కుమార్... సెల్యులాయిడ్పై ఒక్కొక్క సినిమాతో ఒక్కో ప్రపంచాన్ని ఆవిష్కరించే దర్శకుడు. ‘ఇష్టం’, ‘మనం’, ‘24’, ‘గ్యాంగ్లీడర్’... ఈ చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్లు. ఇటీవల నాగచైతన్య కథానాయకుడిగా ‘థ్యాంక్ యూ’ తెరకెక్కించారు.
విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar)... సెల్యులాయిడ్పై ఒక్కొక్క సినిమాతో ఒక్కో ప్రపంచాన్ని ఆవిష్కరించే దర్శకుడు. ‘ఇష్టం’, ‘మనం’, ‘24’, ‘గ్యాంగ్లీడర్’... ఈ చిత్రాలు ఆయన ప్రతిభకు గీటురాళ్లు. ఇటీవల నాగచైతన్య(Naga Chaitanya) కథానాయకుడిగా ‘థ్యాంక్ యూ’ (Thank You) తెరకెక్కించారు. దిల్రాజు నిర్మించిన ఈ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘థ్యాంక్ యూ... అనే మాట చాలా శక్తిమంతమైనది. ఎవరైనా మన కోసం తలుపు తెరవడం, టీ అందించడం దగ్గర్నుంచి చాలాసార్లు థ్యాంక్ యూ అని చెబుతుంటాం. దాన్ని వాడీ వాడీ విలువనే తగ్గించాం. అదే మాటని ఎక్కడ చెప్పాలో అక్కడ, ఎవరికి చెప్పాలో వాళ్లకి అస్సలు చెప్పం. అందుకే ఈ సినిమా తీశా. నేను ఇక్కడిదాకా వచ్చానంటే కారణం మా నాన్న. ఆయనకి ఇప్పటిదాకా థ్యాంక్ యూ చెప్పలేదు. ఉన్నట్టుండి ఆయన మాకందరికీ దూరమయ్యారు. అలా మనం చెప్పాల్సిన కృతజ్ఞతలు చాలానే పెండింగ్లో ఉండిపోతుంటాయి. మీ తల్లిదండ్రులకు ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పి చూడండి. అదొక అద్భుతమైన అనుభవం. ఈ సినిమాలో ఎవరికి ఎవరు ఎప్పుడు చెప్పారనేది ఆసక్తికరం’’.
* ‘‘నాగచైతన్య, నేను కలిసి మూడు నాలుగేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నాం. మా ఇద్దరి మధ్య దాని గురించి చర్చలు జరుగుతున్న సమయంలోనే ‘థ్యాంక్ యూ’ స్క్రిప్ట్ వచ్చింది. ఇందులో కథానాయకుడు 16 ఏళ్లు మొదలుకొని కాలేజీ రోజులు, 35 యేళ్ల మధ్య వయస్కుడి వరకు మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించాలి. అలా కనిపించే ఒకే ఒక్క కథానాయకుడు ఎవరంటే నాకు చైతన్య తప్ప మరొకరు కనిపించలేదు. ఆ పాత్రల్లో వైవిధ్యం చూపించడం కోసం చైతూ చాలా కష్టపడ్డారు. అభిరామ్ పాత్రలో చై ఒదిగిపోయారు. మనం సొంతంగా ఎదిగామంటే మన విజయానికి మనమే కారణం అంటూ మరెవ్వరికీ క్రెడిట్ ఇవ్వడానికి ఒప్పుకోం. అలాంటి వ్యక్తే అభిరామ్. అతని ప్రయాణం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. రాశిఖన్నా, మాళవిక, అవికాగోర్ గుర్తుండిపోయేలా నటించారు. పీసీ శ్రీరామ్తో నాకు ఇది మూడో సినిమా. ఆయన నాకు గురువు, మార్గదర్శకులు. సినిమాపై ఆయనకున్న ప్యాషన్ చూస్తే ముచ్చటేస్తుంది. తమన్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరింది. మిగతా నా బృందం పడిన కష్టానికి కచ్చితంగా ‘థ్యాంక్ యూ’ చెప్పాల్సిందే’’.
* ‘‘ఇదొక కల్పిత కథ. ఎవ్వరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసింది కాదు. బి.వి.ఎస్.రవి కథని అందించారు. వేరొకరి కథతో సినిమా చేయడం ఇదే తొలిసారి. రవి కథ, అందులో ఆత్మ నాకు బాగా నచ్చింది. దానికి నా శైలి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశా. నా సినిమాల్లో కనిపించే ఓ మేజిక్ ఇందులోనూ ఉంటుంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి. దిల్రాజుతో ‘ఆర్య’ నుంచే పరిచయం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. ఇన్నాళ్లకి కుదిరింది. ‘ప్రేమమ్’, ‘మై ఆటోగ్రాఫ్ స్వీట్మెమొరీస్’ సినిమాలు గుర్తుకు రావొచ్చేమో కానీ, ఇదొక భిన్నమైన కథ. కానీ ఆ స్కూల్ సినిమాల జాబితాలో చేరుస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది’’.
* ‘‘నా తదుపరి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఉంటుంది. అందుకోసం కథ సిద్ధం చేస్తున్నా. హిందీలోనూ ఓ యాక్షన్ సినిమా చేస్తున్నా. నేను ఇప్పటిదాకా చేయని కథ అది. ‘24’కి కొనసాగింపు చిత్రం గురించి అప్పుడప్పుడూ కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. దాన్ని కొనసాగించాలనే ఆలోచనైతే ఉంది కానీ, అది ఎప్పుడు కుదురుతుందో తెలియదు’’.
* ‘‘ ఫీల్ గుడ్ సినిమాలంటే చాలా ఇష్టం. రియాలిటీ అంటే నాకు అస్సలు నచ్చదు. సినిమా థియేటర్ నా దృష్టిలో ఒక అందమైన ప్రపంచం. దాన్నుంచి బయటికి వెళ్లాలంటేనే బాధగా అనిపించాలి. అలాంటి అందమైన అనుభూతిని పంచే రొమాంటిక్ సినిమాలు తీయడమే నాకు ఇష్టం. నా సినిమాల్లో థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయంటే కారణం ప్రేక్షకులకు బోర్ కొట్టకూడదనే. అలాగని ప్రతీచోటా థ్రిల్లింగ్ అంశాలు ఉంటే బాగోదు. కథల్నిబట్టే అవసరమైన చోట ఆ పద్ధతిలో సన్నివేశాలు ప్లాన్ చేస్తుంటా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..