Actress: అందాల థ్రిల్లింత
థ్రిల్లర్ కథలు.. వెండితెరపై ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా. ఈ జానర్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ కథల వైపు ఇప్పుడు అగ్ర హీరోలు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ.. సినీప్రియుల్ని థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
థ్రిల్లర్ కథలు.. వెండితెరపై ఎవర్గ్రీన్ హిట్ ఫార్ములా. ఈ జానర్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తుంటుంది. అందుకే కొన్నేళ్ల క్రితం వరకు చిన్న సినిమాలకే పరిమితమైన ఈ కథల వైపు ఇప్పుడు అగ్ర హీరోలు దృష్టి సారిస్తున్నారు. వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలు ఎంచుకుంటూ.. సినీప్రియుల్ని థ్రిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడీ హిట్ ఫార్ములాని అందాల నాయికలూ అందిపుచ్చుకున్నారు. తమదైన శైలి సొగసుల మసాలాలు జోడించి మరీ.. ప్రేక్షకులకు విభిన్న రకాల థ్రిల్లర్లు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు.
యశోద.. ఉత్కంఠ
నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తూనే.. అడపాదడపా రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేస్తోంది నటి సమంత. మిస్టరీ థ్రిల్లర్ ‘యూటర్న్’తో తొలిసారి సినీప్రియులకు థ్రిల్ పంచిన ఈ అమ్మడు.. ఇప్పుడు ‘యశోద’గా మరో థ్రిల్లింగ్ కథను రుచి చూపించనుంది. సామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ నాయికా ప్రాధాన్య చిత్రాన్ని హరి - హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇదొక ఉత్కంఠ కలిగించే యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం కోసం సమంత డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
‘శాకినీ ఢాకినీ’ ఉత్సుకత
కొరియన్ హిట్ సినిమా ‘మిడ్ నైట్ రన్నర్స్’ను ప్రస్తుతం తెలుగులో ‘శాకినీ ఢాకినీ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. సుధీర్ వర్మ దర్శకుడు. డి.సురేష్బాబు, టి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదొక భిన్నమైన యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఉత్సుకత రేకెత్తిస్తూనే.. ఆద్యంతం వినోదాత్మకంగా సాగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెజీనా, నివేదా ట్రైనీ పోలీసులుగా కనిపించనున్నారని తెలిసింది. ఈ నాయికలిద్దరూ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించారని చిత్రబృందం చెబుతోంది.
‘బటర్ఫ్లై’.. సస్పెన్స్
ఇన్నాళ్లు కమర్షియల్ కథానాయికగా తెరపై మెరుపులు మెరిపించిన అనుపమ పరమేశ్వరన్.. ఇప్పుడు నాయికా ప్రాధాన్య సినిమాలతో సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ‘బటర్ఫ్లై’గా కనువిందు చేయనుంది. అనుపమ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని గంటా సతీష్బాబు తెరకెక్కించారు. ఓ వినూత్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రమిది. ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా సాగుతుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ఓ ప్రముఖ ఓటీటీలో నేరుగా విడుదల కానున్నట్లు సమాచారం.
జమున.. ఆసక్తికర ప్రయాణం
కెరీర్ ఆరంభం నుంచీ నటనా ప్రాధాన్యమున్న కథలతోనే ప్రయాణం చేస్తోంది నటి ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం ‘డ్రైవర్ జమున’తో పాన్ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. పా.కిన్స్లిన్ తెరకెక్కించిన చిత్రమిది. రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథతో రూపొందింది. ఇందులో ఐశ్వర్య ఓ క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషించింది. ఒకసారి ఆమె క్యాబ్లో నేర నేపథ్యమున్న కొందరు వ్యక్తులు ప్రయాణిస్తారు. ఆ సందర్భంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనలు ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. తన ప్రాణానికీ ముప్పు ఏర్పడుతుంది. మరి ఆ ముప్పు ఏంటి? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది? అన్నది మిగతా కథ. నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM