Tollywood: ఆకాశమే నువ్వని...

వరుణ్‌సందేశ్‌, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి స్వరకర్త. ఆకాశమే నువ్వని...

Updated : 07 Aug 2022 03:29 IST

రుణ్‌సందేశ్‌, డాలీషా జంటగా నటించిన చిత్రం ‘డైమండ్‌ రాజా’. శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, బి.క్రాంతి ప్రభాత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి స్వరకర్త. ఆకాశమే నువ్వని... అంటూ సాగే ఈ చిత్రంలోని గీతాన్ని ఇటీవల హైదరాబాద్‌లో విడుదల చేశారు. సిద్‌ శ్రీరామ్‌, చిన్మయి శ్రీపాద ఆలపించిన ఈ పాటకి రాంబాబు గోసాల సాహిత్యం అందించారు. నిఖిల్‌ ముఖ్య అతిథిగా హాజరై పాటని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సిద్‌శ్రీరామ్‌, చిన్మయి బాగా పాడారు. ఈ పాట పెద్ద విజయం సాధిస్తుంది. వరుణ్‌ పాటలో చాలా బాగున్నాడు. ‘డైమండ్‌ రాజా’తో వరుణ్‌కి విజయం రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘నా కెరీర్‌లో అరెరే.., నిజంగా... తదితర పాటలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ పాట వాటి సరసన నిలుస్తుందని నమ్ముతున్నా. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని