Nani: ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌

నాని కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘దసరా’. కీర్తిసురేష్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. నాని కెరీర్‌లో రూపొందుతున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా

Updated : 08 Aug 2022 03:45 IST

నాని కథానాయకుడిగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘దసరా’. కీర్తిసురేష్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. నాని కెరీర్‌లో రూపొందుతున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ఇది. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన గ్యాంగ్‌తో కూడిన పోస్టర్‌ని ఆదివారం విడుదల చేశారు కథానాయకుడు నాని. ‘ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌... ఇరగ మరగ చేద్దాం’ అనే వ్యాఖ్యతో ఆ పోస్టర్‌ విడుదలైంది. సింగరేణి బొగ్గు గనులకి సమీపంలోని ఓ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. నాని పూర్తిస్థాయి మాస్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన తన లుక్‌  మార్చుకున్నారు.    తెలంగాణ యాసలో సంభాషణలు చెప్పనున్నారు. సముద్రఖని, సాయికుమార్‌, జరీనా వహాబ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యన్‌ సూర్యన్‌, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, కూర్పు: నవీన్‌ నూలి,  ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా, పోరాటాలు: అన్బరివ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు