Ramya Krishna: మరోసారి అదే కలయిక

నరసింహా-నీలాంబరి.... తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాత్రలు. ఈ రెండు పాత్రల్లో నటించిన  రజనీకాంత్‌, రమ్యకృష్ణ మరోసారి ఒకే చిత్రంలో కనువిందు చేయనున్నారు.

Updated : 11 Aug 2022 11:59 IST

రసింహా-నీలాంబరి.... తెలుగు సినీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన పాత్రలు. ఈ రెండు పాత్రల్లో నటించిన  రజనీకాంత్‌ (Rajinikanth), రమ్యకృష్ణ (Ramya Krishna) మరోసారి ఒకే చిత్రంలో కనువిందు చేయనున్నారు. గతంలో ‘నరసింహా’ చిత్రంలో పోటాపోటీగా నటించి తమిళ, తెలుగు అభిమానుల మన్ననలు పొందిన వీరిద్దరూ ప్రస్తుతం ‘జైలర్‌’ చిత్రం కోసం మళ్లీ కలువనున్నారు. చెన్నైలో బుధవారం నుంచి దీని షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో రజనీ, రమ్య పాల్గొనకపోయినా... ఈ సినిమాలో నటిస్తున్నట్లు రమ్యకృష్ణ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. త్వరలోనే సెట్స్‌లో కలువనున్న వీరిద్దరూ ఇందులో ఎలాంటి పాత్రలు పోషిస్తున్నారోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు