మంచి సినిమా తీస్తే.. చూస్తామనే నమ్మకం ఇచ్చారు
‘‘సీతారామం’ చూసి చాలా ఈర్ష్య పడ్డా. నాకు రావాల్సిన పాత్ర దుల్కర్కు వెళ్లింది (నవ్వుతూ). ‘గీతాంజలి’, ‘సంతోషం’, ‘మన్మథుడు’ రోజులు గుర్తుకు వచ్చాయి’’ అన్నారు కథానాయకుడు నాగార్జున.
- నాగార్జున
‘‘సీతారామం’ చూసి చాలా ఈర్ష్య పడ్డా. నాకు రావాల్సిన పాత్ర దుల్కర్కు వెళ్లింది (నవ్వుతూ). ‘గీతాంజలి’, ‘సంతోషం’, ‘మన్మథుడు’ రోజులు గుర్తుకు వచ్చాయి’’ అన్నారు కథానాయకుడు నాగార్జున. ఆయన గురువారం హైదరాబాద్లో జరిగిన ‘సీతారామం’ విజయోత్సవ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మాత. రష్మిక, సుమంత్, గౌతమ్ మేనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో గురువారం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ.. ‘‘వైజయంతి బ్యానర్ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న స్వప్న, ప్రియాంకకు కృతజ్ఞతలు. అశ్వినీదత్కు వారిద్దరూ పెద్ద అండ. ‘మహానటి’, ‘జాతిరత్నాలు’ ఇప్పుడు ‘సీతారామం’.. వరుసగా అద్భుతమైన చిత్రాలు నిర్మించారు. దర్శకుడు హను కళాత్మకంగా, అద్భుతంగా తెరకెక్కించారు. ఇంటర్వెల్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. ద్వితీయార్థం అత్యద్భుతం. ఇలాంటి సినిమా తీయడానికి ఎంతో ధైర్యం కావాలి. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులైంది. మృణాల్ పాత్రతో ప్రేమలో పడిపోయా. తను తెరపై అంత అందంగా ఉంది. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గతవారం విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాల్ని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు’’ అన్నారు. ‘‘నా కెరీర్లో రామ్ పాత్ర చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్ర రాసిన హనుకు థ్యాంక్స్. సీత పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. మాకింత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు హీరో దుల్కర్ సల్మాన్. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘5వ తేదీ నుంచి నేనొక ఊహా ప్రపంచంలో బతుకుతున్నట్లుగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. నాలుగు సినిమాలు తీశాను. తొలిసారి ఇంతటి ఆదరణ చూస్తున్నా. ఎప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. ఈ కథ దృశ్య రూపంలోకి మారడం వెనక చాలా మంది కృషి ఉంది. వారందరికీ పేరు పేరునా థ్యాంక్స్’’ అన్నారు.
‘‘నాగార్జున మా హీరో. మా బ్యానర్లో అత్యధికంగా ఐదు సినిమాలు చేశారు. ‘సీతారామం’ తీస్తున్నప్పుడు నాగార్జునే గుర్తొచ్చారు’’ అన్నారు నిర్మాత అశ్వినీదత్. ‘‘సీత లాంటి ఐకానిక్ పాత్ర ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అంది నాయిక మృణాల్ ఠాకూర్. ఈ కార్యక్రమంలో స్వప్న దత్, ప్రియాంక దత్, ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్