కళాశాలలో ప్రేమ

త్రిగుణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధమ్‌ నిర్మాత.

Published : 12 Aug 2022 01:41 IST

త్రిగుణ్‌, మేఘ ఆకాష్‌ జంటగా శ్రీకాంత్‌ సిద్ధమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధమ్‌ నిర్మాత. మధుబాల ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. సెప్టెంబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపాయి సినీ వర్గాలు. ‘‘కళాశాల నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. 1996లో విడుదలైన ‘ప్రేమదేశం’ పేరుతో ఇప్పుడొస్తున్న మా సినిమాకి మణిశర్మ స్వరకర్త. ఆయన సమకూర్చిన పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధానబలం. మధుబాల, తనికెళ్ల భరణి తదితర సీనియర్‌ నటుల పాత్రలు ఇందులో కీలకం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’ని దర్శకనిర్మాతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని