Dhanush: మంచి లెవల్‌లోనే ఉన్నాం!

ధనుష్‌ హీరోగా మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై   కళానిధి మారన్‌ నిర్మించారు.

Updated : 14 Aug 2022 07:45 IST

ధనుష్‌ (Dhanush) హీరోగా మిత్రన్‌ ఆర్‌. జవహర్‌ తెరకెక్కించిన తమిళ చిత్రం ‘తిరు చిత్రాంబళం’ (Thiru). సన్‌ పిక్చర్స్‌ పతాకంపై   కళానిధి మారన్‌ నిర్మించారు. నిత్యా మేనన్‌, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ కథానాయికలు. ఈ సినిమాని తెలుగులో ‘తిరు’ పేరుతో విడుదల చేయనుంది ఏషియన్‌ మల్టీప్లెక్స్‌ సంస్థ. శనివారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ ఫుడ్‌  డెలివరీ బాయ్‌ కథగా సాగే చిత్రమిది. ధనుష్‌ ఇందులో పండు అలియాస్‌ తిరు ఏకాంబరం అనే ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా నటించారు. ఆయన చిన్ననాటి స్నేహితురాలు శోభనగా నిత్యామేనన్‌, ప్రేమికురాలు అనూషగా రాశి, మాజీ ప్రేయసి రజనీగా ప్రియా భవానీ శంకర్‌  కనిపించారు. మరి డెలివరీ బాయ్‌గా పనిచేసే పండు.. అనూష, రజనీలలో ఎవరిని ప్రేమించాడు?  వీరి ప్రేమ కోసం శోభన ఎలా సాయపడింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ప్రచార చిత్రంలో కనిపించిన సన్నివేశాల్ని బట్టి సినిమాలో తండ్రీకొడుకుల అనుబంధానికి, స్నేహానికి పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ‘‘మనల్నే మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామనుకుంటా. మనం మంచి లెవల్‌లోనే ఉన్నాం’’ అంటూ ట్రైలర్‌లో ధనుష్‌ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 18న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని