Anupama Parameshwaran: ఏ పాత్ర చేసినా సవాల్ ఉండాలి!
‘‘అవకాశం వచ్చింది కదాని ఏదొకటి చేసేయాలని తొందర నాకు లేదు. ఏం చేసినా మంచి కథలే చేయాలనుకుంటున్నా.
‘‘అవకాశం వచ్చింది కదాని ఏదొకటి చేసేయాలని తొందర నాకు లేదు. ఏం చేసినా మంచి కథలే చేయాలనుకుంటున్నా. గుర్తుండిపోయే పాత్రలే పోషించాలనుకుంటున్నా’’ అంది నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran). ఆమె.. నిఖిల్ (Nikhil) జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ2’ (Karthikeya 2). ‘కార్తికేయ’కు సీక్వెల్గా చందు మొండేటి తెర కెక్కించిన సినిమా ఇది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది అనుపమ.
స్వాతంత్య్ర వేడుకలు అనగానే మీకు గుర్తొచ్చే చిన్నప్పటి జ్ఞాపకాలేంటి?
‘‘పిల్లలందరం కలిసి జెండాలు పట్టుకుని తిరిగిన రోజులు గుర్తొస్తాయి. మా నాన్నకు పొన్నక్కు అని ఓ చిన్న స్కూటీ ఉండేది. దాని హ్యాండిల్కు టేప్తో ఓ జెండా కట్టుకుని స్కూల్కు వెళ్లేవాళ్లం. అలా వెళ్తుంటే భలే గర్వంగా అనిపించేది’’.
‘కార్తికేయ2’ ఫలితాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు?
‘‘సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. వారి మాటలు వింటుంటే సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను పోషించిన ముగ్ధ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అది నాకు మంచి ఎనర్జీని అందిస్తోంది. నా పరిచయ సన్నివేశాలు చూసి.. అందరూ జేమ్స్బాండ్ టైప్లో ఎంట్రీ ఇచ్చావంటున్నారు. అదంతా కాలభైరవ తన నేపథ్య సంగీతంతో చేసిన మ్యాజిక్’’.
ఈ కథలో ఆకర్షించిన అంశాలేంటి?
‘‘పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు కాకుండా కొత్తగా ఇంకేదన్నా చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దర్శకుడు చందు నాకీ కథ వినిపించారు. ఈ స్క్రిప్ట్ వింటున్నప్పుడే చాలా ఎగ్జైట్ అయ్యి సినిమా చేద్దామని నిర్ణయించుకున్నా. ఆధ్యాత్మికత, దైవం వంటి విషయాల్లో కార్తికేయ పాత్రకు ఉన్నట్లే నాకు చాలా ప్రశ్నలున్నాయి. వాటిలో చాలా వాటికి ఈ కథ ద్వారా నాకు సమాధానాలు దొరికాయి. నా ముగ్ధ పాత్ర తెరపై ఎలా కనిపించిందో.. నిజ జీవితంలో నేనూ అలాగే కనిపించేందుకు ఇష్టపడతా. ఇందులోని కృష్ణతత్త్వం కాన్సెప్ట్ బాగా నచ్చింది. అందుకే ఈ సినిమా కోసం నాకు వచ్చిన కొన్ని ప్రాజెక్టులనూ వదులుకున్నా’’.
నటిగా ఓ కంఫర్ట్ జోన్లో ఉండటాన్ని ఇష్టపడతారా? ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపుతారా?
‘‘కంఫర్ట్ జోన్లో పని చేయడమంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ప్రయోగాలే చేయాలి. ఏ పాత్ర చేసినా అందులో ఓ సవాల్ ఉండాలి. దర్శకుడు రీటేక్స్ అడిగినప్పుడే నాకు చాలా నచ్చుతుంది. ఒక ఆర్టిస్ట్గా ఎన్ని భాషల్లో కుదిరితే అన్ని భాషల్లో నాకు నటించాలని ఉంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న హద్దులు చెరిగిపోయాయి. ఇప్పుడంతా ఇండియన్ సినిమా’’.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తయింది. మహిళా సాధికారిత విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
‘‘మహిళలు అన్ని రకాలుగా సాధికారత సాధించారు. ప్రత్యేకంగా మళ్లీ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? పదే పదే మహిళలు వెనుకబడి ఉన్నారని చెప్పడం వల్లే ఇంకా వారు వెనుకబడి ఉన్నారనే భావన కలుగుతోంది. ఇప్పుడు మహిళలు.. మగవారితో సమానంగా ముందుకు వెళ్తున్నారు. వారు ఓవైపు ఇంట్లో పనులు చేసుకుంటూనే.. వృత్తిలోనూ రాణిస్తున్నారు. మగవాళ్లు అలా కాదు.. పని చేసి ఇంటికి రాగానే.. ‘బాగా అలిసిపోయాం టీ పెట్టి, పట్టుకురా’ అని చెప్పి పడుకుంటారు. నాకు తెలిసి సాధికారత మహిళలకు వచ్చింది, మగవాళ్లకే రాలేదనిపిస్తుంది (నవ్వుతూ)’’.
* ‘‘ప్రస్తుతం నేను చేసిన ‘18 పేజెస్’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘బటర్ ఫ్లై’ అనే మరో చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తెలుగులో రెండు కథలకు సంతకాలు చేశా. వీటిలో ఓ నాయికా ప్రాధాన్య చిత్రమూ ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్లు చేస్తున్నా. త్వరలో వాటి వివరాలు అధికారికంగా తెలియజేస్తా’’.
* ‘‘హిట్.. ప్లాప్లను దృష్టిలో పెట్టుకోకుండా మంచి సినిమా చేస్తున్నామనే నమ్మకంతో అందరం కష్టపడ్డాం. ఇప్పుడా నమ్మకం నిజమైంది. దీనికోసం రకరకాల వాతావరణాల్లో చిత్రీకరణ జరిపాం. ఒకరోజు అత్యధిక ఉష్ణోగ్రత ప్రాంతంలో చిత్రీకరణ జరిపితే.. మరో రోజు మైనస్ డిగ్రీ సెల్సియస్లోనూ పనిచేశాం. చాలా కొత్త అనుభవమిది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక