‘సలార్‌’ ఆగమనం ఆరోజే

ప్రభాస్‌ ‘సలార్‌’ నుంచి సినీప్రియులకు కొత్త కబురు అందింది. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్విరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు

Published : 16 Aug 2022 02:44 IST

ప్రభాస్‌ ‘సలార్‌’ నుంచి సినీప్రియులకు కొత్త కబురు అందింది. ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేస్తూ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. పృథ్విరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్‌ కత్తులు చేతబట్టి శత్రువుల్ని చెండాడుతున్నట్లుగా యాక్షన్‌ మోడ్‌లో కనిపించారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. సంగీతం: రవి బస్రూర్‌, ఛాయాగ్రహణం: భువన గౌడ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని