Raghavendra Rao: చెబుతున్నంతసేపూ నవ్వుతున్నాం..
‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రావు పెట్టిన ఉపశీర్షిక అది. ఆయన జీవితంలో పండుకి ఉన్న ప్రాధాన్యం అదీ!
కె.రాఘవేంద్రరావు
కొంచెం తీపి... కొంచెం కారం... కొంచెం పండ్లు...
- ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకానికి అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రావు పెట్టిన ఉపశీర్షిక అది. ఆయన జీవితంలో పండుకి ఉన్న ప్రాధాన్యం అదీ! న్యూటన్ ఆపిల్ పడినప్పుడు గురుత్వాకర్షణ కనిపెడితే, నేను మాత్రం ఆపిల్ ఎక్కడ పడాలో కనిపెట్టానని చెబుతారాయన. అందుకేనేమో ఇటీవల ‘వాంటెడ్ పండుగాడ్’ అంటూ ఓ సినిమానీ సమర్పిస్తున్నారు. శ్రీధర్ సీపాన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఇది ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా దర్శకేంద్రుడు ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘సామాజికంగా... రాజకీయంగా చాలా గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈఎమ్ఐలు, పెరిగిన ధరలు, ఫీజులు, కరోనా తర్వాత పరిణామాలు... వీటిన్నిటితో ఎవరిని కదిపినా సరే ఒక రకమైన ఒత్తిడి కనిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో మనందరికీ కావల్సింది స్వచ్ఛమైన నవ్వు. మనసుకి చికాకుగా అనిపించిందంటే మన మిత్రుల్లో సరదాగా మాట్లాడే వాళ్లుంటే కాసేపు వాళ్లదగ్గరికి వెళ్లి గడుపుతాం. అలా ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి హాస్యభరితం చిత్రం చేస్తే బాగుంటుందనిపించింది. అప్పుడే జనార్ధన మహర్షి ఓ కథ చెప్పారు. చెబుతున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాం. జంధ్యాల, ఈవీవీ ఉన్నప్పుడు వాళ్ల సినిమాలకి వెళ్లి కడుపుబ్బా నవ్వుకుని వచ్చేవాళ్లం. మన జీవితాల్లో అరుదైనవి కాబట్టి హాస్యానికీ, గ్లామర్కీ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. జనార్ధన మహర్షి కథ చెప్పగానే ఇది నా శైలి పాటలతో, వందశాతం వినోదంతో సినిమా తీయాలని నడుం బిగించాం. అదే... ‘వాంటెడ్ పండుగాడ్’’.
* ‘‘నిధి వేట తరహాలో సాగే కథ ఇది. పట్టుకుంటే కోటి అనే ఉపశీర్షికలోనే ఈ కథ ఉంది. ఇందులో ఒకొక్కరికీ ఒక్కో అవసరం ఉంటుంది. ఆ అవసరాలు చాలా సరదాగా, నవ్వుకునేలా ఉంటాయి. వాళ్లందరూ కోటి కోసం ఎలా ప్రయత్నించారనేది ఈ సినిమా కథ. నటుల్లో చాలామంది ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పట్టుకుంటే పది కోట్లు’ అని, ఆ తర్వాత ఇరవై కోట్లు అని వరుసగా సినిమాలు చేద్దామన్నారు. వాళ్లందరినీ అంతగా ప్రభావితం చేసిందీ కథ. ఎంతో బాధ్యతగా తీసుకుని కొత్తతరాన్ని పరిచయం చేశా. కథానాయకులు, కథానాయికలు, సాంకేతిక నిపుణులు... చాలామందే నా సినిమాలతో పరిచయమయ్యారు. మొన్న ‘పెళ్లిసందడి’తో నాయకానాయికలుగా పరిచయమైన రోషన్, శ్రీలీల వరకు అందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు దర్శకుల్ని పరిచయం చేస్తున్నా. ‘పెళ్లిసందడి’ సినిమాకి మాటలు రాస్తూ మాతో ప్రయాణం చేసిన శ్రీధర్ సీపానలో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. తనైతే బాగుంటుందని దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పా’’.
* ‘‘ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ2’ ఇలా ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా వైవిధ్యంగా సాగే సినిమాలు. మా సినిమా చాలా రోజుల తర్వాత వస్తున్న సంగీతం, గ్లామర్ ప్రధానంగా సాగే
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రం’’.
* ‘‘ఆత్మకథలా నా గురించి కాకుండా... పరిశ్రమకి, రాబోయే తరానికి ఉపయోగపడాలనే ‘నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ’ పుస్తకాన్ని రాశా. నేను ‘సౌందర్యలహరి’తో మాట్లాడటానికీ కారణం అదే. ఇంత జీవితాన్నిచ్చిన సినీ రంగానికి మనమేదైనా చేయాలనే మాట్లాడా. ప్రతి ఎపిసోడ్ ఓ పాఠంలా నాతో కలిసి పనిచేసిన నటులు, సాంకేతిక నిపుణుల అనుభవాలతో ఆ కార్యక్రమం సాగుతుంది. సహాయ దర్శకులు, దర్శకులు వాళ్ల జీవితాల్లో చేయాల్సినవి, చేయకూడనివంటూ కొన్ని ఉంటాయి. అలాంటి విషయాల్ని నా అనుభవాలతో ఈ పుస్తకంలో చెప్పే ప్రయత్నం చేశా. అక్కడక్కడా నా వ్యక్తిగత జీవిత విశేషాలు ఉంటాయి. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధామూర్తి ఈ పుస్తకాన్ని చదివి ఫిల్మ్ ఇండస్ట్రీ బైబిల్గా అభివర్ణించారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్