‘రాఘవన్‌-2’కు కసరత్తు

కమల్‌హాసన్, జ్యోతిక, కమలిని ముఖర్జీ నాయకనాయికలుగా నటించిన తమిళచిత్రం ‘వెట్టియాడు  వెలియాడు’. ఇది తెలుగులో ‘రాఘవన్‌’గా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీని దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌

Updated : 19 Aug 2022 05:05 IST

కమల్‌హాసన్, జ్యోతిక, కమలిని ముఖర్జీ నాయకనాయికలుగా నటించిన తమిళచిత్రం ‘వెట్టియాడు వెలియాడు’. ఇది తెలుగులో ‘రాఘవన్‌’గా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. దీని దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. ‘విక్రమ్‌’ వంటి విజయంతో జోరుమీదున్న కమల్‌ హాసన్‌ ఆగస్టు 22 నుంచి ‘భారతీయుడు-2’ను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకెళ్తున్నారు. తర్వాత ఆయన ‘వెట్టియాడు వెలియాడు-2’ చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో కథానాయికగా కీర్తిసురేష్‌ ఎంపికైంది. వచ్చే ఏడాది ఈ సినిమాను తెలుగులో ‘రాఘవన్‌-2’గా విడుదల చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని