Ponniyin Selvan: ‘బాహుబలి’ వల్లే పొన్నియిన్ సెల్వన్
‘‘ఒక కథని విజయవంతంగా రెండు భాగాలుగా ఎలా చెప్పాలో రాజమౌళి చూపించారు. ‘బాహుబలి’ సినిమాల వల్లే ‘పొన్నియిన్ సెల్వన్’ సాధ్యమైంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ‘పి.ఎస్.1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘‘ఒక కథని విజయవంతంగా రెండు భాగాలుగా ఎలా చెప్పాలో రాజమౌళి చూపించారు. ‘బాహుబలి’ సినిమాల వల్లే ‘పొన్నియిన్ సెల్వన్’ సాధ్యమైంది’’ అన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా ‘పి.ఎస్.1’ పేరుతో సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యారాయ్, త్రిష తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో దిల్రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని చోళ చోళ... అంటూ సాగే పాటని శుక్రవారం హైదరాబాద్లో విడుదల చేశారు. అనంత శ్రీరామ్ రచించిన ఈ పాటని.. మనో, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరకర్త. పాట విడుదల వేడుకని ఉద్దేశించి అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఒక కళాత్మకమైన చరిత్ర. ఒక చారిత్రాత్మకమైన కళ. ఇలాంటి సినిమాని చూడటానికి కళ్లు, పాటలు వినడానికి చెవులు ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఇలాంటి సినిమాలో పనిచేయడానికి నాజన్మ ఎంత పుణ్యం చేసుకుందో అనుకుంటుంటా. ఈ సినిమాలో పాటలు రాయడం సవాల్గా అనిపించినా, ఎంతో సంతోషంగా స్వీకరించి ఏడు పాటలు పూర్తి చేశా. దానికి కారణం మణిరత్నం నాకు ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ల బృందం అందించిన సహకారం. నాకంటూ ఓ చరిత్ర ఉంటే అందులో బంగారు పుటల్లో రాసుకునే అనుభవం ఈ సినిమా ప్రయాణం. చోళ చోళ... పాట ఇంత ఘనంగా విడుదల కావడం ఓ ప్రత్యేకత’’ అన్నారు.
* విక్రమ్ మాట్లాడుతూ ‘‘మణిరత్నంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రావణ్’ తర్వాత ఈ సినిమాలో నటించా. శంకర్, మణిరత్నం సినిమాల్లో నటించాకే రిటైర్మెంట్ కావాలని ముందే అనుకున్నా. మణిరత్నం సినిమాలో ఇలాంటి ఓ మంచి పాత్రని చేయడం నాకు దక్కిన ఓ భాగ్యం’’ అన్నారు.
* కార్తి మాట్లాడుతూ ‘‘నాకు చాలా ప్రత్యేకమైన వేదిక ఇది. మణిరత్నం దగ్గర సహాయ దర్శకుడిగా నా కెరీర్ మొదలుపెట్టా. ఎంతోమంది చేయాలనుకున్న పాత్రని చేసే అవకాశం నాకు వచ్చింది. ఒకొక్కపాత్రకి ఒక్కో లక్ష్యం ఉంటుంది. సినిమా చివరలో ఆ లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అనేది ఆసక్తికరం. వెయ్యేళ్ల కిందట రాజ రాజ చోళ యువరాజుగా ఉన్నప్పుడు, ఆయన మహారాజు కాకముందు సాగే కథ ఇది. 90 శాతం నిజజీవిత పాత్రల ఆధారంగానే ఈ సినిమా రూపొంందింది. 140 రోజుల్లో రెండు భాగాల సినిమాల్ని పూర్తి చేశాం. గొప్ప సన్నివేశాల్ని తెరపై చూడనున్నాం. రెహమాన్ సంగీతం, రవివర్మన్ కెమెరా పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. నేను పాత తెలుగు భాషలో డబ్బింగ్ చెబుతున్నా’’ అన్నారు.
* ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ ‘‘తమిళనాట జనపదమై పోయిన ఓ కథ ఇది. దీన్ని 30 గంటల సినిమా చేయాలి. మణిరత్నం ఇప్పటికిప్పుడు అనుకుని కాకుండా, ఒక దశాబ్ధ కాలంగా ప్రయత్నిస్తూ చేసిన సినిమా ఇది’’ అన్నారు.
* సుహాసిని మాట్లాడుతూ ‘‘దీని గురించి తెలుసుకుని అందరూ ‘మీ ఆయన చాలా కష్టపడి సినిమా తీస్తున్నారు, ఆయనకి సహకారం అందించు’ అన్నారు. మా ఆయన కష్టపడి తీయలేదు, ఇష్టపడి తీశారు. ఇది నీ కలల సినిమానా అడిగాను. లేదు, నాకు ఇష్టమైనది’’ అన్నారు.
* మణిరత్నం మాట్లాడుతూ ‘‘చిరంజీవి సహా చాలా మందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకనేది త్వరలోనే తెలుస్తుంది. రాజమౌళికి కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటి కథల్ని ఎలా తీయాలో చెబుతూ తలుపులు తెరిచి మా అందరికీ దారి చూపించారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దిల్రాజు, నాజర్ పాల్గొన్నారు.
* తనికెళ్ల భరణి మాట్లాడుతూ మాట్లాడుతూ ‘‘25 ఏళ్ల తర్వాత మళ్లీ నేను పెన్ను పట్టుకుని ఈ సినిమాకి మాటలు రాశా. దానికి కారణం మణిరత్నం. పాతికేళ్ల కిందట ‘దళపతి’ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మణిరత్నం ఫోన్ చేసి ఈ సినిమాకి మాటలు రాయాలని కోరారు. జయరాం పోషించిన పాత్రకి కూడా నేను డబ్బింగ్ చెప్పా. చాలా రకాలుగా గొప్ప అనుభవాల్నిచ్చిందీ చిత్రం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా