మా ఇద్దరికీ దిష్టి పెట్టేశారు..
చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని... అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్బాబు - మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.
చిత్రసీమలో కొన్ని కలయికలు ప్రేక్షకుల్లో ఆసక్తిని... అంచనాల్ని పెంచుతుంటాయి. సుధీర్బాబు - మోహనకృష్ణ ఇంద్రగంటి కలయిక అలాంటిదే. ‘సమ్మోహనం’, ‘వి’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేసిన మరో చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుధీర్బాబు గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
ఇంతకీ ఆ అమ్మాయి గురించి ఏం చెబుతున్నారు?
ఏం చెబుతున్నాం అనేది ట్రైలర్లోనే కొంతవరకు చూపించాం. కంటి వైద్యురాలైన ఓ అమ్మాయిని చూసి తన సినిమా కోసం ఎంపిక చేయాలనుకుంటాడు ఓ దర్శకుడు. దానికి వాళ్ల ఇంట్లో అస్సలు అంగీకరించరు. మరి ఆ దర్శకుడు ఎలా ఒప్పించాడు? ఆ అమ్మాయి ఒప్పుకున్నాక ఎలాంటి సమస్యలు వచ్చాయనేది తెరపైనే చూడాలి. నేను ఇందులో ఓ సినిమా దర్శకుడిగా కనిపిస్తా.
ఇంద్రగంటి దర్శకత్వంలో వరుసగా సినిమాలు చేస్తున్నారు. మీకూ, ఆయనకీ మధ్యనున్న అనుబంధమే అందుకు కారణమా?
‘మనం సినిమా తీస్తున్నాం అనుకుంటాం కానీ, సినిమానే మనల్ని తీస్తుంది’ అని ఈ సినిమా వేడుకలో నేను చెప్పా. ఇంద్రగంటి రాసుకున్న కథలే మమ్మల్ని ఎంచుకుంటున్నాయనేది నా అభిప్రాయం. నన్ను నటుడిగా ఆయన నమ్మారు, ఆయన కథల్ని నేను నమ్ముతాను. అదే మా కలయికలో సినిమాలు రావడానికి కారణం. ఆయన ఎప్పుడూ ఒక కలయికని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయరు. ఒకసారి అమెరికా నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్లో దర్శకుడు సుకుమార్ కలిసినప్పుడు కూడా ఇదే మాటే చెప్పారు. హిట్ ఇచ్చిన వెంటనే దర్శకులు పెద్ద స్టార్లని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తుంటారు. ఇంద్రగంటి మాత్రం తను రాసుకున్న కథలకి తగ్గట్టుగానే నటుల్ని ఎంచుకుని సినిమాలు చేస్తారు. మార్కెట్, ఇతరత్రా లెక్కలేవీ ఆయన పట్టించుకోరు. ఆయన కథలకి తగ్గ కథానాయకుడిని నేను కావడం అదృష్టంగా భావిస్తానంతే.
మొదట ఈ కథని ఎప్పుడు విన్నారు?
‘వి’ చిత్రీకరణ మధ్యలోనే ఒకసారి చెప్పారు. అయితే అది నాకోసమని కాకుండా, తన మనసులో ఉన్న కథల్ని పంచుకుంటుంటారు. అయితే ఈ కథ నా దగ్గరికి వస్తుందని అనుకోలేదు. ‘సమ్మోహనం’ తరహాలో ఇది కూడా సినిమా నేపథ్యంలో సాగే కథే కానీ, దానికీ దీనికీ మధ్య ఏమాత్రం పొంతన ఉండదు. ‘సమ్మోహనం’ అబ్బాయి, అమ్మాయి మధ్యలో సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. ఇది మాత్రం ప్రేమ, కుటుంబం, డ్రామా అంశాలతో సాగుతుంది. ఇంద్రగంటి తీసిన సినిమాల్లో భావోద్వేగాల పరంగా బలమైన చిత్రమిదే. కృతిశెట్టి చాలా బాగా నటించింది. ఆమె ‘ఉప్పెన’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా ఇది.
చాలా మంది దర్శకులతో కలిసి ప్రయాణం చేశారు. తెరపై దర్శకుడిగా నటించడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?
ప్రతి కమర్షియల్ దర్శకుడికీ ఓ అభిరుచి ఉంటుంది. నా పాత్ర కూడా అంతే. కొంచెం తిక్క కూడా ఉంటుంది. ఎలాంటి సినిమాలు తీసినా ఒక బలమైన కారణం ఉంటుంది, కమర్షియల్ దర్శకులు తీసేది కూడా మంచి సినిమానే అనే విషయాన్ని స్పృశించిన తీరు ఆకట్టుకుంటుంది. అతను తీసేదే సినిమా అని భావించే దర్శకుడిగా కనిపిస్తా. కొంచెం స్టైలిష్గా, మన దర్శకులు కనిపించే తీరుకి భిన్నంగానే కనిపిస్తా. ఇదివరకు సినిమాలు చేసేటప్పుడు కథలో ఎక్కడో ఒక చోట ఇంద్రగంటి కనిపించేవారు. కానీ ఈ పాత్రలో ఆయన అస్సలు కనిపించలేదు. సినిమా నేపథ్యంలో కథే అయినా సినిమాటిక్ లిబర్టీస్ లేకుండా చాలా సహజంగా సాగుతుందీ చిత్రం.
‘సమ్మోహనం’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’... ఇవే కాకుండా సినిమా నేపథ్యంలో మరో కథ కూడా తీస్తానని చెప్పారు. మీకు చెప్పారా?
ఆ మూడో కథని కూడా నాకు చూచాయగా చెప్పారు. అదొక నాయికా ప్రధానమైన కథ అని ఓ చిన్న ఆధారం కూడా ఇచ్చారు. అయితే ఇప్పట్లో ఆయన తీయరు. ఇంకా వేరే జోనర్స్లో రాసిన మంచి కథలు ఆయన దగ్గర ఉన్నాయి. మా కలయికకి ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టారు (నవ్వుతూ). మరి ఆ సినిమాని నాతో చేస్తారో లేదో తెలియదు.
ఈ సినిమా వేడుకలో నటుడిగా మీలో పరిణతి గురించి నాగచైతన్య ప్రత్యేకంగా ప్రస్తావించారు. దానిపై మీ అభిప్రాయమేమిటి?
నా కెరీర్లో తొలి హీరో నాగచైతన్య. తనతో ఎప్పుడు మాట్లాడినా పాజిటివ్గా ఉంటుంది. నటనపరంగా నా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే ఆలోచన కంటే కూడా, మంచి పాత్రల్ని ఎంపిక చేసుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. దర్శకులు అలాంటి మంచి పాత్రల్ని రాశారు. అవి ప్రేక్షకులకు నచ్చడం తృప్తిగా ఉంది.
హిందీలోనూ నటించారు. అక్కడి నుంచి కొత్తగా అవకాశాలేమైనా వస్తున్నాయా?
వస్తూనే ఉన్నాయి. ఈమధ్య విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’లో నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ అప్పట్లో ‘సమ్మోహనం’తోపాటు, పుల్లెల గోపీచంద్ సినిమా చేసే ప్రయత్నాల్లో ఉన్నా. అందుకే ‘బ్రహ్మాస్త్రం’ చేయలేకపోయా. ఇక్కడే ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయి. ఇదివరకు మంచి కథ కోసం ఏడాదికిపైగా ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఓ సినిమా చేస్తుండగానే, రెండు మూడు నెలలకి కొత్తగా మరో సినిమా మొదలైపోతుంటుంది. అంత మంచి కథలొస్తున్నాయి. ఈమధ్యే నా మనసుకు బాగా నచ్చిన కథలతో నాలుగు సినిమాలు చేస్తున్నా. ‘హంట్’, ‘మామా మశ్చీంద్ర’తోపాటు, ‘సెహరి’ దర్శకుడు జ్ఞానసాగర్తో ఓ సినిమా, యు.వి.క్రియేషన్స్లో ఓ సినిమా చేస్తున్నా. ఈ ఏడాది చివరిలోపు రెండు సినిమాలు పూర్తి చేస్తాను.
తెరపైన దర్శకుడిగా కనిపించారు. మరి నిజ జీవితంలో దర్శకుడయ్యే ఆలోచనలేమైనా ఉన్నాయా?
మొదట్లో ఉండేది కాదు కానీ, ఇప్పుడైతే ఆ కల ఉంది. నేను పనిచేసింది దాదాపుగా కొత్తవాళ్లతోనే. ఒకొక్కసారి కథలో లీనమై కొన్ని సన్నివేశాలు నేనే రాసేవాణ్ని. అవి నచ్చి దర్శకులు తీసుకోవడం, కొన్నిసార్లు నా ఖర్చుతో షూట్ చేసి నచ్చితే తీసుకోండని చెప్పడం... ఇలా తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతానికైతే నటనపైనే దృష్టిపెట్టా. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానేమో తెలియదు. కథలు రాసుకోవడం అంటూ లేదు కానీ, కొన్ని పాయింట్స్గా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నటుడిగా అంటే 65 రోజులు సినిమాకి అంకితం చేస్తే సరిపోతుంది. కానీ దర్శకత్వం బోలెడంత శ్రమిస్తే తప్ప కథ సిద్ధం చేసుకోలేం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు