Tollywood: యువ హీరో లోకం ‘ఒక్కటే’ మంత్రం
యువ కథానాయకుల సినీ డైరీలు చాలా వరకు పక్కాగానే ఉంటాయి. ‘ఏడాదిలో ఇన్ని చిత్రాలు చేయాలి.. ఇన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల’ని పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతుంటారు. ఒకరకంగా సినిమా బండిని చకచకా పరుగులు పెట్టించేది వీళ్లే.
యువ కథానాయకుల సినీ డైరీలు చాలా వరకు పక్కాగానే ఉంటాయి. ‘ఏడాదిలో ఇన్ని చిత్రాలు చేయాలి.. ఇన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల’ని పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగుతుంటారు. ఒకరకంగా సినిమా బండిని చకచకా పరుగులు పెట్టించేది వీళ్లే. అగ్ర కథానాయకులు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే.. కుర్ర హీరోలు మాత్రం ఒక్కో ఏడాది నాలుగైదు సినిమాలతో జోరు చూపిస్తుంటారు. నాని, నితిన్, శర్వానంద్ తదితరులంతా ఇలా వరుస చిత్రాలతో సందడి చేసిన వాళ్లే. కానీ, ఇప్పుడీ పరిస్థితులు తారుమారయ్యాయి. చిరంజీవి, పవన్ కల్యాణ్, రవితేజ వంటి అగ్ర తారలంతా రెండు మూడు సినిమాలతో సెట్స్పై బిజీగా గడుపుతుంటే.. పలువురు యువ హీరోలు మాత్రం ఒక్కో చిత్రంతోనే సరిపెట్టుకోవడం ఆసక్తికరంగా మారింది.
* వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచారు కథానాయకుడు నాని. ప్రతి ఏడాదీ తన నుంచి మూడు చిత్రాలైనా విడుదల చేస్తుంటారాయన. కొవిడ్ పరిస్థితులు ఎదురు కాక ముందు వరకు ఆయన సినీ డైరీ ఇలా వరుస సినిమాలతోనే కళకళలాడింది. కానీ, ఇప్పుడాయన డైరీలో ఒకే ఒక్క చిత్రం కనిపిస్తోంది. అదే ‘దసరా’. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న చిత్రమిది. అయితే దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పారని, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని ప్రచారం వినిపిస్తున్నా.. ఇంత వరకు దేనిపైనా స్పష్టత రాలేదు.
* కొత్తదనం నిండిన కథల్ని అందిపుచ్చుకోవడంలోనూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు శర్వానంద్. ‘మహానుభావుడు’ లాంటి హిట్ తర్వాత వరుస పరాజయాలు ఎదురవడంతో.. కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించడం మొదలు పెట్టారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకటి తర్వాత మరొకటి అన్నట్లుగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలోనూ ఒక చిత్రమే ఉంది. కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం.. అక్టోబరు నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. మరి దీని తర్వాత ఆయన చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు.
* గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల సినిమాల విషయంలో కాస్త నెమ్మదించారు సాయితేజ్. ఆ ప్రమాదం తర్వాత కొన్నాళ్లు ఇంటికే పరిమితమైన ఆయన.. పూర్తిగా కోలుకున్నాక దర్శకుడు కార్తీక్ దండు చిత్రాన్ని పట్టాలెక్కించారు. ఓ విభిన్నమైన థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. దీని తర్వాత పవన్ కల్యాణ్ - సాయితేజ్ కలయికలో ‘వినోదాయ సీతం’ రీమేక్ పట్టాలెక్కనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ, ఇంత వరకు ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వెలువడలేదు.
* కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు కథానాయకుడు నితిన్. ఇటీవలే ‘మాచర్ల నియోజకవర్గం’తో మరో చేదు ఫలితాన్ని రుచి చూశారు. ఇప్పుడాయన డైరీలోనూ ఒకే ఒక్క ప్రాజెక్ట్ కనిపిస్తోంది. అదే వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
* ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా కెరీర్ ఆరంభంలోనే వరుస విజయాలు అందుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు విజయ్ దేవరకొండ. ఆయన ఇటీవలే ‘లైగర్’తో పాన్ ఇండియా హీరోగా అదృష్టం పరీక్షించుకొని.. దెబ్బతిన్నారు. దీంతో ఆయన సినీ డైరీలో ప్రణాళికలన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. నిజానికి ఆయన అనుకున్నట్లు జరిగి ఉంటే ఈపాటికి తను ఓవైపు ‘ఖుషి’తో పాటు మరోవైపు ‘జనగణమన’తో సెట్స్పై తీరిక లేకుండా గడుపుతుండేవారు. కానీ, ‘లైగర్’ దారుణ ఫలితాన్ని అందుకోవడంతో.. ‘జనగణమన’ను అర్థంతరంగా పక్కకు పెట్టి ‘ఖుషి’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
* గతేడాది దసరాకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’గా వచ్చి.. చక్కటి విజయాన్ని అందుకున్నారు అఖిల్ అక్కినేని. ఆయన ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రం చేస్తున్నారు. అయితే దీని తర్వాత అఖిల్ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు స్పష్టత రాలేదు.
కారణం ఇదేనా...
యువ కథానాయకులు సినిమాల పరంగా వేగం తగ్గించడానికి వెనక రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. కొవిడ్ పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. వారు ఏ కథల్ని ఇష్టపడుతున్నారు? వేటిని పక్కకు పెడుతున్నారన్నది స్పష్టంగా తెలియడం లేదు. వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేసే యువ హీరోలు సైతం ఈ విషయంలో ఎదురు దెబ్బలు తినక తప్పడం లేదు. ‘అంటే.. సుందరానికీ’ చిత్ర విషయంలో నానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. విభిన్నమైన వినోదాత్మక కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కినా వాణిజ్యపరంగా ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కలేదు. అందుకే ఇప్పుడు కథల ఎంపికలో ప్రతి హీరో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితులున్నాయి. మరోవైపు ప్రస్తుతం యువ హీరోలు సైతం పాన్ ఇండియా ట్రెండ్ను అందిపుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇందుకు తగ్గట్లుగా ఇప్పటికే ఆ తరహా కథలతో అదృష్టం పరీక్షించుకోనున్న వారు.. ఆ చిత్ర ఫలితాన్ని బట్టి కథలు ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనతో వేచి చూస్తున్నారు. అందుకే ఇప్పుడు పలువురు యువ కథానాయకుల డైరీల్లో ఖాళీలు కనిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్