Ponniyin Selvan: మణిరత్నం 40 ఏళ్ల కల... ‘పొన్నియిన్ సెల్వన్’
‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. జయం రవి, విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్కుమార్, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.
‘‘తెలుగు ప్రేక్షకులు 42 ఏళ్లుగా నాపై ప్రేమ చూపిస్తున్నారు. అదే ప్రేమని ఈ సినిమాపై చూపించండ’’ని కోరారు ప్రముఖ నటి సుహాసిని. ఆమె భర్త మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’. జయం రవి, విక్రమ్, కార్తి, ఐశ్వర్యరాయ్, త్రిష, శరత్కుమార్, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సుభాస్కరన్ నిర్మాత. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రంలో తొలి భాగం ‘పీఎస్1’గా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. దిల్రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు కార్తి మాట్లాడుతూ ‘‘ఇలాంటి సినిమా చేసేటప్పుడే సినిమా ఎంత గొప్ప మాధ్యమమో గుర్తుకొస్తుంది. మణిరత్నం సర్ 40 ఏళ్ల కల ఈ సినిమా’’ అన్నారు. విక్రమ్ మాట్లాడుతూ ‘‘నాన్న, అపరిచితుడు... ఇలా ఒకొక్క సినిమాలో ఒకొక్క భావోద్వేగం నచ్చుతుంది. ఈ సినిమాలో గుర్రంపై వచ్చే ఒక్క షాట్ చాలు అనిపించింది’’ అన్నారు. సుహాసిని మాట్లాడుతూ ‘‘పెళ్లికి ముందు మణిరత్నం నాకొక బహుమానం ఇచ్చారు. చోళ హోటల్లోకి పెద్ద బ్యాగ్ తీసుకొచ్చి ఐదు వాల్యూమ్స్ పొన్నియిన్ సెల్వన్ నవలలు ఇచ్చి చదివి, లైన్గా రాసి ఇవ్వు అన్నారు. ప్రతీ ఛాప్టర్ చదివి ఒకొక్క లైన్ రాసి ఇచ్చా. వన్ లైన్ ఆర్డర్ అంటే ఇలాగా రాసేది అన్నారు. పెళ్లి చేసుకోరేమో అనుకున్నా (నవ్వుతూ). 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా చేశారు. దానికి కారణం సుభాస్కరన్. ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి’’ అన్నారు. ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ ‘‘38 ఏళ్లుగా తెలుగులో పనిచేస్తున్నా. రమేష్నాయుడు, చక్రవర్తి, రాజ్ కోటి, సత్యం... ఇలా వీళ్లందరితో కలిసి చేసిన ప్రయాణంతో నా కెరీర్కి పునాదులు పడ్డాయి. భాష, కవిత్వం, గౌరవం.... వీటన్నిటికీ కృతజ్ఞతలు. ఈ సినిమా తర్వాత నేను ఓటీటీల్లో సిరీస్లు చూడటం మానేశాను. మన సంస్కృతి, మన రక్తం, మనవాళ్లు చేసిన సినిమా ఇది. గొప్పగా ఉంది’’ అన్నారు. ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ‘‘సెల్యూటాయిడ్పై ఓ పెయింట్ని సృష్టించాం. మణిరత్నం కలకి జీవితాన్నిచ్చే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది’’ అన్నారు. కార్యక్రమంలో త్రిష, కార్తి, జయం రవి, దిల్రాజు, శోభిత ధూళిపాళ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు