Tollywood: మనసింత ఉల్లాసంగా ఉన్నా..!
అశోక్ సెల్వన్ హీరోగా ఆర్.ఎ.కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశం’. వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కథానాయికలు. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు హరీష్ శంకర్ శుక్రవారం విడుదల చేశారు
అశోక్ సెల్వన్ హీరోగా ఆర్.ఎ.కార్తీక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశం’. వయాకామ్ 18, రైజ్ ఈస్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ కథానాయికలు. ఈ చిత్ర టీజర్ను దర్శకుడు హరీష్ శంకర్ శుక్రవారం విడుదల చేశారు. ‘‘హేయ్ అర్జున్.. మనసింత ఉల్లాసంగా ఉన్నప్పుడు మర్చిపోవాలనుకున్న విషయాలు కూడా ఇంకా అందంగా గుర్తొస్తాయి కదూ’’ అంటూ రీతూ చెప్పే డైలాగ్తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆహ్లాదభరితంగా సాగింది. ఇందులో అశోక్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. ముగ్గురు నాయికలతో అతనికి ఉన్న అనుబంధాన్ని ఆసక్తికరంగా చూపించారు. ఈ మూడు ప్రేమ కథల్లోనూ బలమైన భావోద్వేగాలు నిండి ఉన్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తుంది. మరి ఈ కథలన్నీ సుఖాంతమయ్యాయా? లేదా? తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ చిత్రాన్ని నవంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాకి సంగీతం: గోపీ సుందర్, ఛాయాగ్రహణం: లీలావతి కుమార్.
ఎడారిలో పుష్పం
అనంతపురం జిల్లా తెదేపా నేత చమన్సాబ్ జీవితం ఆధారంగా ‘చమన్’ పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. ఎడారిలో పుష్పం...అనేది ఉపశీర్షిక. వెంకట్ సన్నిధి దర్శకత్వం వహిస్తున్నారు. జి.వి.చౌదరి నిర్మాత. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘చమన్సాబ్ బతికున్న రోజుల్లోనే ఈ స్క్రిప్ట్ పూర్తి చేశాం. కరోనా కారణంగా ఆలస్యమైంది. చమన్ స్నేహితుడిగా ఆయన జీవితంపై ఈ సినిమాని నిర్మిస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి చమన్సాబ్. ఆయన గురించి అందరికీ తెలిసేలా, ఎవ్వరినీ కించపరచని రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. కార్యక్రమంలో సి.రాంప్రసాద్, మోహిత్ రెహమాన్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్