Selvaraghavan: ధనుష్తో దర్శకులకి చాలా సౌకర్యం
సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్. సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ
సినిమా తీతలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు... సెల్వ రాఘవన్ (Selvaraghavan). సహజత్వానికి పెద్ద పీట వేస్తూ, చూసే ప్రేక్షకుడికి ‘మన కథే’ అనిపించేలా సినిమాలు తీస్తుంటారాయన. ఆయన సినిమాలు తమిళంతోపాటు, తెలుగులోనూ విడుదలవుతుంటాయి. తన తమ్ముడు ధనుష్ (Dhanush) కథానాయకుడిగా... సుదీర్ఘ విరామం తర్వాత ఓ సినిమా చేశారు. అది ‘నేనే వస్తున్నా’ (Nene Vasthunna) పేరుతో తెలుగులో ఈ నెల 29న గీతా ఆర్ట్స్ సమర్పణలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెల్వ రాఘవన్ శనివారం విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘ధనుష్, నేను కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. మేమిద్దరం కలిసి సినిమా చేయాలనేది మా అమ్మ కోరిక కూడా. ధనుష్ పెద్ద స్టార్ అయిపోయాడు. తన డేట్స్ దొరకడం అంత సులభం కాదు ఇప్పుడు. అదే సమయంలో మా ఇద్దరికీ తగ్గ కథ కూడా కుదరాలి. దాదాపు పదేళ్ల తర్వాత మేం కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. మొదట ‘పుదు పెట్టై2’ చేయాలనుకున్నాం. తర్వాత వేరే ఆలోచన వచింది. నాతో కలిసి ఓ సినిమా రాయాలని ధనుష్కి ఎప్పట్నుంచో కోరిక. తొలిసారి ఈ సినిమాని ఇద్దరం కలిసి రాశాం. మా ఇద్దరి ఆలోచనలు దాదాపుగా ఒకేలా ఉంటాయి’’.
* ‘‘నా ఆలోచన నుంచి పుట్టిన కథే.. ‘నేనే వస్తున్నా’. కథ, కథనాల కంటే కూడా... ధనుష్ ద్విపాత్రాభినయం విషయంలో ఎక్కువ సవాళ్లు ఎదురయ్యాయి. రెండు విభిన్నమైన పాత్రలు, ఒకేసారి తెరపై కనిపిస్తుంటాయి. ఆ పాత్రల్ని ఇద్దరు వేర్వేరు నటులు చేసినట్టే ఉండాలి. ఒకపాత్ర నుంచి మరో పాత్రకి మారిపోయి నటించడం ఓ పెద్ద సవాల్. అయితే ధనుష్తో పని చేయడం దర్శకులకి చాలా సౌకర్యం. తనకి పెద్దగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. ప్రతీ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని నటిస్తుంటాడు. తను నాకు తమ్ముడే అయినా మేం సెట్కి వెళ్లాక నటుడు, దర్శకుల్లాగే మెలుగుతాం. 20 యేళ్లుగా అలా పనిచేయడమే తెలుసు. తను తమ్ముడైనంత మాత్రాన నాకు సెట్లో అదనంగా ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. మేం ఇద్దరం కొన్ని సన్నివేశాల గురించి వాదించుకుంటాం కూడా. ‘నేనే వస్తున్నా’ గీతా ఆర్ట్స్ నుంచి విడుదలవుతుండడం ఓ గౌరవం. మంచి కథ ఉంటే చెప్పండంటూ ప్రోత్సహిస్తుంటారు నిర్మాత అల్లు అరవింద్’’.
* ‘‘చిత్రసీమలో ఇప్పుడున్న దశ ప్రత్యేకమైనది. సినిమాల మధ్య హద్దులు చెరిగిపోయాయి. దక్షిణాది సినిమా ఇప్పుడు భారతీయ సినిమా అయ్యింది. రాజమౌళి, సుకుమార్ తదితర దర్శకుల ఆలోచనలతోనే ఇది సాధ్యమైంది. వాళ్లని కథానాయకులు కూడా అదే స్థాయిలో నమ్మారు. ఇది ముమ్మాటికీ వేడుక సమయం. మరిన్ని చిత్రాలు వస్తాయనే నమ్మకం ఉంది. మనవైన కథలతోనే అందరికీ వినోదం పంచుతున్నాం. ‘యుగానికి ఒక్కడు’ సినిమా అప్పటి పరిస్థితులకి తగ్గట్టుగా నేను తీశా. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో ఇప్పుడు మరింత బాగా తీస్తాననిపిస్తుంది. అలాంటి చిత్రాల్ని తీయడం ఇప్పుడు మరింత సులభంగా మారింది. ‘యుగానికి ఒక్కడు’కి కొనసాగింపు ఆలోచన ఉంది. అన్నీ కుదిరితే చేస్తానేమో. మనకు తెలిసిన గొప్ప సామ్రాజ్యాల్లో చోళ సామ్రాజ్యం ఒకటి. చోళ సామ్రాజ్యం నేపథ్యం ఒక్కటే తప్ప, రానున్న ‘పొన్నియిన్ సెల్వన్’కీ... నా ‘యుగానికి ఒక్కడు’ సినిమాకీ ఎలాంటి సంబంధం ఉండదు’’.
‘‘నటుడిగా 17, 18 యేళ్ల వయసులో తెరకు పరిచయమయ్యాడు ధనుష్. అప్పట్లో తనకి ఏవైనా సలహాలు ఇచ్చేవాణ్ని కానీ, ఇప్పుడు ఆ అవసరం లేదు. కాకపోతే తను చేసే సినిమాల గురించి చెబుతుంటాడు. నేను అనుకోకుండానే నటుడినయ్యా. ‘సాని కాయిదం’లో నేను నటిస్తేనే బాగుంటుందని ఆ చిత్ర దర్శకుడు పట్టుబట్టాడు. దాంతో అదొక కొత్త అనుభవంలా ఉంటుందని నటించా. ‘నేనే వస్తున్నా’లో కూడా ఓ చిన్న పాత్ర చేశాను. దర్శకత్వంపైనే నా దృష్టంతా. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తర్వాత తెలుగు సినిమా చేయలేదని అడుగుతుంటారు. కానీ నా సినిమాల చిత్రీకరణ ఎక్కువగా హైదరాబాద్లోనే జరుగుతుంటాయి. దాంతో తెలుగు సినిమా చేస్తున్నట్టే ఉంటుంది. మంచి కథ కుదిరితే తప్పకుండా తెలుగులో సినిమా చేస్తా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: రేవంత్
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు