Tollywood: కొత్త ఊసుల కోసం... అక్టోబరు మాసం
అగ్ర తారల సినిమాల విడుదలలు... కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు... కొత్త లుక్స్... కొత్త కబుర్లతో సినీ అభిమానుల్ని మురిపించనుంది అక్టోబరు మాసం నెల. కొన్ని నెలలుగా పరిమిత వ్యయంతో కూడిన సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది సినీ ప్రేమికులు.
అగ్ర తారల సినిమాల విడుదలలు... కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు... కొత్త లుక్స్... కొత్త కబుర్లతో సినీ అభిమానుల్ని మురిపించనుంది అక్టోబరు మాసం నెల. కొన్ని నెలలుగా పరిమిత వ్యయంతో కూడిన సినిమాలతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది సినీ ప్రేమికులు. సెట్స్పైకి వెళతాయనున్న పలువురు అగ్ర తారల సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి. వచ్చే నెల నుంచి ఆ సినిమాలన్నీ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. దసరా, దీపావళి పండగలు కూడా వస్తున్నాయి కాబట్టి ఆ సందర్భంగా కొత్త సినిమాలు, కొత్త కలయికల కబుర్లు కూడా వినిపించనున్నాయి.
వేసవి తర్వాత బాక్సాఫీసు యువ కథానాయకులకే అంకితమైంది. స్టార్ హీరోల సినిమాలేవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. మళ్లీ బాక్సాఫీసు దగ్గర అసలు సిసలు హంగామా దసరా నుంచే మొదలవుతోంది. చిరంజీవి, నాగార్జున నటించిన ‘గాడ్ఫాదర్’, ‘ది ఘోస్ట్’ అక్టోబరు 5న విడుదలవుతున్నాయి. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’తోపాటు మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తాయి. వాయిదా పడుతూ వచ్చిన కొత్త సినిమాలు పట్టాలెక్కడానికి కూడా ఇదే తరుణంగా కనిపిస్తోంది. ఆ జాబితాలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ సినిమాలు ముందు వరసలో ఉన్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ‘పుష్ప2’ అక్టోబరులోనే సెట్స్పైకి వెళ్లనున్నట్టు సమాచారం. చాలా రోజులుగా పూర్వ నిర్మాణ పనుల్ని నిర్వహిస్తోంది చిత్రబృందం. దాదాపుగా ఆ పనులు పూర్తి కావడంతో ఇక అల్లు అర్జున్ కెమెరా ముందుకు రావడం పక్కా అయినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ - కొరటాల కలయికలలో రూపొందనున్న సినిమాకి సంబంధించిన కసరత్తులు కూడా పూర్తయినట్టు తెలిసింది. ఇటీవలే ఎన్టీఆర్ పూర్తిస్థాయి స్క్రిప్ట్ విని పక్కా చేసినట్టు తెలిసింది. దాదాపుగా అక్టోబర్ నెలలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనున్నట్టు సమాచారం. పవన్కల్యాణ్ కూడా తన సినిమా ‘హరి హర వీరమల్లు’ని అదే నెలలోనే పునః ప్రారంభించనున్నట్టు సమాచారం. మహేష్బాబు - త్రివిక్రమ్ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ని పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో హీరోయిన్ పూజా హెగ్డే కూడా రంగంలోకి దిగనుంది.
ప్రచార సందడి
పండగలు వచ్చాయంటే చిత్రసీమలో ప్రచార హంగామా ఓ స్థాయిలో సాగుతుంటుంది. భలే మంచి రోజు అంటూ ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తుంటారు సినీ రూపకర్తలు. కొత్త కలయికల్ని, సినిమాల పేర్లనీ ప్రకటిస్తుంటారు. వేడుకల్నీ నిర్వహిస్తుంటారు. ఆ తరహా సందడి దసరా, దీపావళి సందర్భంగా గట్టిగానే సాగనున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ ఫస్ట్లుక్ని దసరా సందర్భంగానే విడుదల చేయనున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ పుట్టినరోజు అక్టోబరు 23న కాబట్టి ఆ సందర్భంగా కూడా ఆయన సినిమాలకి సంబంధించి సందడి కనిపించనుంది. బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న సినిమా పేరుని దసరా సందర్భంగానే ప్రకటించే అవకాశాలున్నట్టు సమాచారం. మహేష్ సినిమా పేరు గురించి కూడా ప్రచారం సాగుతోంది. కొత్త కలయికల వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నాని, నాగచైతన్యతోపాటు పలువురు యువ కథానాయకులు ఈమధ్యే కొత్త కథలకి పచ్చజెండా ఊపేశారు. ఆ వివరాలన్నీ కూడా అధికారికంగా వెల్లడయ్యే అవకాశాలున్నాయి. అక్టోబరు నుంచి తెలుగు చిత్రసీమలో ఓ కొత్త ఊపు కనిపించనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు