Indira Devi: మహేష్కి మాతృవియోగం
ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయనకి సతీవియోగం, కథానాయకుడు మహేష్బాబుకి మాతృవియోగం కలిగింది. కృష్ణ సతీమణి, మహేష్ మాతృమూర్తి ఇందిరాదేవి (70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో
కన్నుమూసిన ఇందిరాదేవి చిత్రసీమలో విషాదం
ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ (Krishna) ఇంట విషాదం నెలకొంది. ఆయనకి సతీవియోగం, కథానాయకుడు మహేష్బాబుకి (MaheshBabu) మాతృవియోగం కలిగింది. కృష్ణ సతీమణి, మహేష్ మాతృమూర్తి ఇందిరాదేవి (70) (Indira Devi) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఇందిరాదేవి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 1961లో కృష్ణ వివాహం ఇందిరాదేవితో జరిగింది. వారికి రమేష్బాబు, మహేష్బాబుతోపాటు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని సంతానం. ఈ ఏడాది జనవరిలో పెద్ద కుమారుడు రమేష్ అనారోగ్యంతో మృతిచెందారు. ఇంతలోనే ఇందిరాదేవి కన్ను మూయడంతో మహేష్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
సినీ, రాజకీయ ప్రముఖుల నివాళి
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ఇందిరాదేవి(70) మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇందిరాదేవి భౌతికకాయానికి సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కృష్ణ, మహేష్బాబు, నమ్రతా శిరోద్కర్లతోపాటు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాళులు అర్పించారు. సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, వెంకటేష్, అశ్వనీదత్, మంచు మోహన్బాబు, మురళీమోహన్, నందమూరి రామకృష్ణ, నాగార్జున, మంచు విష్ణు, దగ్గుబాటి రానా, అడివిశేషు, విజయ్ దేవరకొండ, మెహర్ రమేష్, సుకుమార్, గోపీచంద్, త్రివిక్రమ్, బి.గోపాల్, తమన్, కొరటాల శివ, మంచు లక్ష్మి, జీవితా రాజశేఖర్, బండ్ల గణేష్, తమ్మారెడ్డి భరద్వాజ, బోయపాటి శ్రీను, గుణశేఖర్, కె.ఎల్.నారాయణ, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు నివాళులు అర్పించారు. బుధవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. మహేష్ అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు. మరోవైపు ఇందిరాదేవి మరణం పట్ల పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, ఎన్టీఆర్, రవితేజ, శ్రీవిష్ణు, నందమూరి మోక్షజ్ఞ, మారుతి, హరీష్శంకర్, అనిల్ రావిపూడి, ఆది సాయికుమార్, సుమంత్, రాజీవ్ కనకాల, తేజ్ తదితరులు తమ సంతాపాన్ని తెలిపారు.
- న్యూస్టుడే, జూబ్లీహిల్స్
అమ్మ చేతి కాఫీ
సినిమా విడుదలకి ముందు అమ్మ ఇందిరాదేవి దగ్గరికి వెళ్లి ఆమె చేతి కాఫీ తాగడం మహేష్కి అలవాటు. ఆ విషయాన్ని మహేష్ పలు సందర్భాల్లో చెప్పేవారు. ‘నాకు అమ్మంటే దేవుడితో సమానం. సినిమా విడుదలకి ముందు అమ్మ దగ్గరికి వెళ్లి కాఫీ తాగుతా. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్టు ఉంటుంద’’నేవారు.
తల్లి పేరుతో నిర్మాణ సంస్థ
మంజుల, మహేష్ కలిసి తన తల్లి పేరుతో ఇందిరా ప్రొడక్షన్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థలో ఇద్దరూ కలిసి పలు చిత్రాల్ని నిర్మించారు.
వెక్కివెక్కి ఏడ్చిన సితార..
నానమ్మ ఇందిరాదేవి భౌతికకాయాన్ని చూసి మనవరాలైన సితార వెక్కివెక్కి ఏడ్చింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కుమార్తెను మహేష్ తన ఒడిలో కూర్చొబెట్టుకొని సముదాయించే ప్రయత్నం చేసినా ఆమె కన్నీరు ఆగలేదు. నానమ్మను ఇలా చూసిన సితార.. తట్టుకోలేక వెక్కివెక్కి ఏడ్వడం అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు