కెమెరా ముందుకు...

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం కోసం నటుడిగా కెమెరా ముందుకొచ్చారు. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అంజిబాబు, రాజవ్వ, సుధాకర్‌

Published : 30 Sep 2022 01:40 IST

సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం కోసం నటుడిగా కెమెరా ముందుకొచ్చారు. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. అంజిబాబు, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి, కీర్తి లత ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. బత్తిని కీర్తిలత గౌడ్‌, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మాతలు. జేడీ లక్ష్మీనారాయణతోపాటు, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, అద్దంకి దయాకర్‌లపై ఇటీవలే తెరకెక్కించిన కీలక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తయిందని సినీ వర్గాలు తెలిపాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ సంఘటన ప్రేరణతో రూపొందించిన చిత్రమిద’’ని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని