‘అంజలి’ చిత్ర స్ఫూర్తితో..
బాల నటులు వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి ముఖ్య పాత్రల్లో శివమ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘లిల్లీ’. కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. నేహ ప్రధాన పాత్రలో నటించింది.
బాల నటులు వేదాంత్ వర్మ, ప్రణితా రెడ్డి ముఖ్య పాత్రల్లో శివమ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘లిల్లీ’. కె.బాబురెడ్డి, జి.సతీష్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. నేహ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్ర ఫస్ట్లుక్, ప్రచార గీతాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ శనివారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘క్యాన్సర్పై పోరాటం మీద తీసిన చిత్రమిది. ఆ వ్యాధిని ఓ డైనోసార్తో పోలుస్తూ.. పోస్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘32ఏళ్ల క్రితం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే ఈ చిత్రానికి స్ఫూర్తి. ఇందులో లిల్లీ పాత్రలో నటించిన నేహ నా జీవితానికి టర్నింగ్ పాయింట్. ఈరోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా విడుదల చేసేంత గొప్ప అవకాశాన్నిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర దర్శకుడు శివమ్. నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘పిల్లల్ని దేవుళ్లంటారు కదా. అలా ఎందుకు అంటారో మా చిత్రం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ లిల్లీ లాంటి బంగారు తల్లి మా ఇంట్లోనూ ఉంటే బావుండు అనుకుంటారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్వీర్, శివ కృష్ణ, రాజీవ్ పిళ్లై, మిషెల్ తదితరులు పాల్గొన్నారు.
‘రుద్రుడు’.. వచ్చేది ఆరోజే
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. కతిరేసన్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ కథానాయిక. శరత్ కుమార్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది. ఈ మేరకు విడుదల తేదీతో కూడిన ఓ కొత్త పోస్టర్ను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ఆ పోస్టర్లో లారెన్స్ తలపై గాయంతో సీరియస్గా చూస్తూ కనిపించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత కతిరేసన్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని క్రిస్మస్కు విడుదల చేయాలనుకున్నాం. కానీ, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పట్టేలా కనిపిస్తోంది. అందుకే దీన్ని 2023 ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు.
‘సూపర్ 30’కి జపాన్ సలాం
గణితశాస్త్ర నిపుణుడు, విద్యావేత్త ఆనంద్కుమార్ జీవితం ఆధారంగా.. హృతిక్ రోషన్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘సూపర్ 30’. మూడేళ్ల కిందట భారత్లో విడుదలై, మంచి విజయం సాధించింది. దీన్ని ప్రముఖ పంపిణీదారు సంస్థ స్పేస్బాక్స్ లిమిటెడ్ సెప్టెంబరు 23న జపాన్లో 50 థియేటర్లలో విడుదల చేసింది. అన్నిచోట్లా విజయవంతంగా ప్రదర్శితమవడమే కాదు..చాలాచోట్ల ప్రేక్షకుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ దక్కుతోంది. ఈ సందర్భంగా స్పేస్బాక్స్ సీఈవో దురైపాండ్యన్ మాట్లాడుతూ ‘‘సూపర్ 30’కి మేం ఊహించిన దానికంటే స్పందన బాగుంది. ఆనంద్కుమార్ ఎంతో శ్రమకోర్చి పేద పిల్లల్ని ఐఐటియన్లుగా తీర్చిదిద్దే కథాంశం జపాన్ ప్రేక్షకులకు బాగా నచ్చడంతో బ్రహ్మరథం పడుతున్నారు. అక్కడి విద్యార్థులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు’ అన్నారు. ఈ చిత్రంలో అమిత్ సాధ్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించారు.
యువతరం ‘మది’లో
శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి జంటగా నాగ ధనుష్ తెరకెక్కించిన చిత్రం ‘మది’. రామ్ కిషన్ నిర్మాత. స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్ బైరోజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. ‘‘కొత్తదనం నిండిన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. ఈతరం యువత ఆలోచనా విధానానికి అద్దం పట్టేలా ఉంటుంది’’ అన్నారు.
‘దసరా’లో నాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!