Praveen Sattaru: ఆ భయం.. బాధ్యత ఉంటే చాలు
‘చందమామ కథలు’, ‘పిఎస్వి గరుడవేగ’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు. ఇప్పుడాయన ‘ది ఘోస్ట్’తో థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున హీరోగా నటించిన చిత్రమిది. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5న విడుదల కానుంది.
‘చందమామ కథలు’, ‘పిఎస్వి గరుడవేగ’ వంటి వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru). ఇప్పుడాయన ‘ది ఘోస్ట్’తో (The Ghost) థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన చిత్రమిది. సోనాల్ చౌహాన్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు దర్శకుడు ప్రవీణ్.
‘‘ఘోస్ట్ అనేది ఊహాతీతమైన పేరు. అలాగే చాలా శక్తిమంతమైనది కూడా. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ విభాగంలో దీనికొక పవర్ ఉంటుంది. ఇలాంటి అధికారి ఎవరికీ కనిపించడు. ఎక్కడున్నాడో తెలియదు. ఒకవేళ ఎవరైనా తెలుసుకోవాలంటే తను కలుసుకోవాలనుకుంటేనే తెలుస్తుంది. సినిమాలో హీరో క్యారక్టరైజేషన్ ఈతరహాలోనే ఉంటుంది. అందుకే అండర్ వరల్డ్లో ప్రతిఒక్కరూ అతన్ని ఈ పేరుతోనే పిలుస్తుంటారు’’.
క్లాస్గా తీసిన మాస్ సినిమా..
‘‘నాగార్జున కోసమే సిద్ధం చేసుకున్న కథ ఇది. ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని ఇలా కథ సిద్ధం చేసుకోవడం నా కెరీర్లో ఇదే తొలిసారి. నాగ్ సర్ అంటే నా మనసులో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆయన ఇంటెన్సిటీ, స్టైల్, గ్రేస్ ఉపయోగించుకొని.. తనని ఎలా చూడాలనుంటున్నానో అలా తీర్చిదిద్దుకున్నా వారి పాత్రను. ఈ చిత్రంలో ఆయన విక్రమ్ అనే ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తారు. యాక్షన్తో పాటు ఎమోషన్స్కీ ఎంతో ప్రాధాన్యముంది. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే ఎపిసోడ్స్ దీంట్లో చాలా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే క్లాస్గా తీసిన పక్కా మాస్ చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’’.
ఆ పోరాట ఘట్టాలు ప్రత్యేకం..
‘‘ఇది పూర్తిగా ఫిక్షనల్ సినిమా. ఏ చిత్రానికీ స్ఫూర్తిగా ఉండదు. ఇందులో మొత్తం 12 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. విరామ, క్లైమాక్స్ సమయాల్లో వచ్చే పోరాట ఘట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీంట్లో కనిపించే తమహగనే కత్తికీ ఓ స్టోరీ ఉంటుంది. విక్రమ్ తన వృత్తి జీవితంలో చాలా మిషన్స్లో పాల్గొని ఉంటారు. అలా తన ప్రయాణంలో భాగంగా జపాన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ వ్యక్తి ఇచ్చే మెటల్తో తయారు చేసేదే తమహగనే’’.
కొవిడ్ మేలే చేసింది..
‘‘కొవిడ్ వల్ల మాకు మేలే జరిగింది. అందరూ ప్రపంచ సినిమాలకు అలవాటు పడ్డారు. మంచి చిత్రం ఏది.. అసలు సినిమా నాణ్యత ఎలా ఉండాలి? అన్నది ప్రేక్షకులకు తెలిసింది. ఇప్పుడు ఏది థియేటర్ చిత్రమో.. ఏది ఓటీటీ సినిమానో ప్రతిఒక్కరూ ఇట్టే చెప్పేస్తున్నారు. పోస్టర్, టీజర్ చూసే దాని కోసం థియేటర్ వరకు రావొచ్చో లేదో అంచనా వేసేస్తున్నారు. నా దృష్టిలో సినిమా తీయడమంటే.. సినిమా అనే పుస్తకంలో ఒక పేజీ రాయడం. ‘ది ఘోస్ట్’ అనేది అలాంటి ఒక పేజీనే. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ పేజీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి అక్షరాన్నీ ఆచితూచి రాయాలి. ఈ భయం.. బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’.
నిర్మాతల కష్టాలు తెలుసు..
‘‘సొంత ప్రొడక్షన్లో చేయడం వల్ల నిర్మాత కష్టాలు నాకు బాగా తెలుసు. అలాగే ఎంత వరకు రాజీ పడాలో కూడా తెలుసు. సొంత నిర్మాణ సంస్థలో చేస్తే విడుదల సమయంలో సమస్య వస్తుంది. ఇదంత తేలికైన వ్యవహారం కాదు. గతంలో నేనిలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నా. నేను ఓ సినిమా చేస్తున్నానంటే ఆ చిత్ర నిర్మాతను కచ్చితంగా సెట్కు రమ్మని చెబుతా. ఎందుకంటే ఆయన సెట్లో ఉంటే పనులు చకచకా జరిగిపోతాయి’’.
* ‘‘నేను ప్రస్తుతం వరుణ్ తేజ్తో ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నా. పూర్తిగా లండన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. దీంట్లో మంచి సందేశం ఉంది. అది భవిష్యత్ తరాలకు గట్టిగా తగిలేలా ఉంటుంది. ఈనెల 10 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. దీంతో పాటు త్వరలో ఓ వెబ్సిరీస్ కూడా చేయనున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో