ముగ్గురూ ఒకే ఫ్రేమ్‌లో!

కథానాయకులు ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రల్లో తళుక్కుమనడం సాధారణమే. అభిమానుల్ని ప్రత్యేకంగా ఆకర్షించే అంశం అది. చిన్న పాత్రలే అయినా  అవి కొన్నిసార్లు చాలా ప్రభావం చూపిస్తుంటాయి. ‘విక్రమ్‌’ సినిమాలో సూర్య పాత్ర చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ సినిమాలోనూ రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో సందడి చేయనున్నాడు.

Published : 03 Oct 2022 02:03 IST

థానాయకులు ఒకరి సినిమాలో మరొకరు అతిథి పాత్రల్లో తళుక్కుమనడం సాధారణమే. అభిమానుల్ని ప్రత్యేకంగా ఆకర్షించే అంశం అది. చిన్న పాత్రలే అయినా  అవి కొన్నిసార్లు చాలా ప్రభావం చూపిస్తుంటాయి. ‘విక్రమ్‌’ సినిమాలో సూర్య పాత్ర చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు సల్మాన్‌ఖాన్‌ సినిమాలోనూ రామ్‌చరణ్‌ అతిథి పాత్రలో సందడి చేయనున్నాడు. ఆ విషయాన్ని సల్మాన్‌ స్వయంగా బయటపెట్టారు. ఆయన కథానాయకుడిగా హిందీలో ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుండగా, సెట్‌కి వెళ్లిన రామ్‌చరణ్‌ ‘మీ ఇద్దరితో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించాలని ఉంది’ అంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడట.  మొదట సరదాగా అంటున్నాడేమో అనుకున్నా మరుసటి రోజు నిజంగానే సెట్‌కి వచ్చాడట. అలా రామ్‌చరణ్‌ తన సినిమాలో అతిథి పాత్రలో నటించాడని, సెట్‌లో మేం కలిసి నటించడం ఓ మంచి అనుభవం అని ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు సల్మాన్‌ఖాన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని