Tollywood: ముగింపు మెరిసేనా!
అదిరే ఆరంభం.. మెరుపులాంటి ముగింపు.. ఈ రెండింటికీ క్రికెట్లోనే కాదు.. చిత్రసీమలోనూ ఎంతో ప్రాధాన్యముంది. కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల ఈ ఏడాది చిత్రసీమకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనింగ్లో వచ్చి దంచి కొడతాయనుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కొవిడ్ దెబ్బకు బెదిరి క్రీజులోకి అడుగు పెట్టకుండానే వెనక్కు వెళ్లిపోయాయి.
అదిరే ఆరంభం.. మెరుపులాంటి ముగింపు.. ఈ రెండింటికీ క్రికెట్లోనే కాదు.. చిత్రసీమలోనూ ఎంతో ప్రాధాన్యముంది. కొవిడ్ మూడో దశ ఉద్ధృతి వల్ల ఈ ఏడాది చిత్రసీమకు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనింగ్లో వచ్చి దంచి కొడతాయనుకున్న ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కొవిడ్ దెబ్బకు బెదిరి క్రీజులోకి అడుగు పెట్టకుండానే వెనక్కు వెళ్లిపోయాయి. నాగార్జున - నాగచైతన్య ‘బంగార్రాజు’తో సంక్రాంతి బరిలో నిలిచి.. చెప్పుకోదగ్గ ఆరంభాన్ని అందించడంతో బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు చిత్రసీమకు నూతనోత్తేజాన్ని అందిస్తే.. వేసవిలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ చిత్రాలు భారీ వసూళ్లతో మెరుపులు మెరిపించాయి. అక్కడి నుంచి ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’, ‘మేజర్’, ‘విక్రమ్’, ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ2’.. ఇలా నెలకొకటి చొప్పున హిట్టు మాట వినిపిస్తూనే వచ్చింది. ఇప్పుడు సినీ క్యాలెండర్ చివరి పేజీల్లోకి చేరుకుంది. ఇప్పటికే దసరా, దీపావళి వినోదాలు ఖరారయ్యాయి. మిగిలింది నవంబరు, డిసెంబరు మాసాల బెర్తులే. కొత్త ఏడాదికి నూతనోత్సాహంతో స్వాగతం పలకాలన్నా.. సంక్రాంతి చిత్రాలకు భరోసా అందించాలన్నా.. రానున్న ఈ రెండు నెలల నుంచి ఓ మెరుపు లాంటి ముగింపు అందిపుచ్చుకోక తప్పదు. మరి ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి మెరుపు ముగింపు సాధ్యమేనా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం చిత్రసీమలో ఓ చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు అగ్ర హీరోల చేతుల్లో కానీ, అటు మీడియం రేంజ్ హీరోల చేతుల్లో గానీ విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు కనిపించడం లేదు. దసరాకు ‘గాడ్ఫాదర్’తో చిరంజీవి, ‘ది ఘోస్ట్’తో నాగార్జున బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మళ్లీ వీరిని చూడాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడాలి. ప్రస్తుతం చిరు ‘భోళా శంకర్’, ‘మెగా 154’ (వర్కింగ్ టైటిల్) చిత్రాలతో సెట్స్పై బిజీగా ఉన్నా.. ఇవన్నీ కొత్త ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’తో పాటు ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలు సైతం వచ్చే ఏడాదే థియేటర్లలోకి వరుస కట్టనున్నాయి. ఇక ప్రస్తుతం ఒక్కో చిత్రంతో బిజీగా ఉన్న రామ్చరణ్, మహేష్బాబు, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, సాయితేజ్, నాగచైతన్య, నాని, నితిన్, శర్వానంద్ తదితర స్టార్లంతా ఈ ఏడాది దర్శనమిచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
అగ్ర తారల్లో ఆ ఇద్దరికే అవకాశం..
గతేడాది ముగింపులో ‘అఖండ’గా బాక్సాఫీస్ బరిలో నిలిచి భారీ విజయంతో సత్తా చాటారు అగ్రహీరో బాలకృష్ణ. ఇప్పుడాయన మరోసారి ఈతరహా మ్యాజిక్ను రిపీట్ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తిరేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో చక్కటి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇది ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. నవంబరు నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాని డిసెంబరు బరిలో నిలపడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని డిసెంబరులో తీసుకొస్తారా? లేక పండగ వైపు మొగ్గు చూపుతారా? అన్నది అందరిలోనూ ఆసక్తిరేకెత్తిస్తోంది. రవితేజ ప్రస్తుతం నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వినోదంతో నిండిన సరికొత్త యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
కుర్ర హీరోలదే జోరంతా..
ఈ ఏడాది ముగింపులో కుర్ర హీరోల సందడి రెట్టింపు స్థాయిలో కనిపించబోతుంది. ‘కార్తికేయ2’ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు యువ హీరో నిఖిల్. ఇప్పుడాయన ‘18 పేజెస్’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన ప్రేమకథా చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది. నవంబరు లేదా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ వేసవిలో ‘మేజర్’తో బాక్సాఫీస్ ముందుకొచ్చి ప్రేక్షకుల్ని మెప్పించారు కథానాయకుడు అడివి శేష్. ఇప్పుడు ‘హిట్2’తో మరో హిట్టును ఖాతాలో వేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. విభిన్నమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది ఇప్పటికే ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు యువ హీరో విష్వక్ సేన్. ఇప్పుడాయన ‘ఓరి దేవుడా’ అంటూ అలరించేందుకు సిద్ధమయ్యారు. అశ్వత్ మారి ముత్తు తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో హీరో వెంకటేష్ దేవుడి పాత్రలో సందడి చేయనున్నారు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కానుంది. ‘నాంది’ వంటి హిట్ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఏఆర్ మోహన్ దర్శకుడు. అమాయకులైన గిరిజనుల కోసం ఓ ప్రభుత్వ అధికారి చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 11న థియేటర్లలోకి రానుంది. ఈ ఏడాది ముగింపులో వరుస సినిమాలతో సందడి చేయనున్నారు యువ హీరో సత్యదేవ్. దసరాకి చిరంజీవితో కలిసి ‘గాడ్ఫాదర్’తో అలరించనున్న ఆయన.. ఆ వెంటనే ‘రామ్ సేతు’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘కృష్ణమ్మ’ చిత్రాలతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఇవన్నీ ఈ సంవత్సరమే థియేటర్లలోకి రానున్నట్లు సత్యదేవ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ‘సెబాస్టియన్’, ‘సమ్మతమే’, ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ చిత్రాలతో ఈ ఏడాది ఇప్పటికే హ్యాట్రిక్ ప్లాప్లు అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘రూల్స్ రంజన్’ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ రెండు సినిమాలూ.. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు కిరణ్ ఇప్పటికే ప్రకటించారు. పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల కానున్న సమంత ‘యశోద’, తేజ సజ్జా ‘హనుమాన్’ చితాల్రు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అయితే ఇవి ఈ ఏడాది వస్తాయా? కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల్ని పలకరిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్