Tollywood: సంక్షిప్త వార్తలు (6)
అల్లరి నరేశ్ కథానాయకుడిగా... ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది కథానాయిక. రాజేష్ దండా నిర్మాత. ‘లచ్చిమి...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని మంగళవారం విడుదల చేశారు.
ఇట్లు.. లచ్చిమి పాట
అల్లరి నరేశ్ (Naresh) కథానాయకుడిగా... ఏఆర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam). ఆనంది కథానాయిక. రాజేష్ దండా నిర్మాత. ‘లచ్చిమి...’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటని మంగళవారం విడుదల చేశారు. శ్రీమణి రచించిన ఈ గీతాన్ని, జావేద్ అలీ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల స్వరకర్త. గిరిజన ప్రాంతమైన మారేడుమిల్లికి, ఎన్నికల విధుల కోసం వెళ్లిన ఓ ప్రభుత్వాధికారి పాత్రలో నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్రాజ్ తదితరులు నటించారు.
ప్రిన్స్ రాక అక్టోబరు 21న
వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివకార్తికేయన్ (Sivakarthikeyan), ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కె.వి. కలయికలతో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘ప్రిన్స్’ (Prince). మారియా ర్యాబోషప్క కథానాయిక. ఈ చిత్రం అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. ఈ సందర్భంగా ఒక పోస్టర్ని విడుదల చేశారు. అందులో శివకార్తికేయన్ హుషారుగా డాన్స్ చేస్తూ కనిపించారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకంపై సునీల్ నారంగ్, డి.సురేష్బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గుండెను కొంగున చుట్టెనా..
యశ్రాజ్, నవమీ గాయక్ జంటగా రామకృష్ణార్జున్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అభిరామ్’ (Abhiram). శివబాలాజీ, నవీన్రెడ్డి, రఘుబాబు, బాహుబలి ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. లెజండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జింకా శ్రీనివాసులు నిర్మించారు. ఈ సినిమా నుంచి ఈమధ్యే ‘సైదులో సైదులా ఆ నంగనాచి పిల్లా...’ అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు. యువతరంతోపాటు దీనికి అన్నివర్గాల్లో మంచి స్పందన లభిస్తోందంటూ మంగళవారం సంతోషం వ్యక్తం చేసింది చిత్రబృందం. ఈ పాటకి సాగర్ నారాయణ లిరిక్స్ అందించగా ఉమా నేహ, సింహాలు ఆలపించారు. మీనాక్షి భుజంగ్ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నట్టు తెలిపారు.
ఈ నెల 28న ‘జెట్టి’
నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్టి’ (Jetty). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణుమాధవ్ పిచ్చుక నిర్మిస్తున్నారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకుడు. చివరిదశ సన్నాహాల్లో ఉన్న ఈ సినిమా ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. కథానాయిక నందిత శ్వేత మాట్లాడుతూ ‘పల్లెటూరి అమ్మాయిగా నటించాలి అనే కోరిక ఈ చిత్రంతో తీరుతోంది. ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతుంది’ అన్నారు. ‘ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాం. మత్స్యకారుల జీవితాల్లో సమస్యలను చెప్పే చిత్రమిది’ అన్నారు దర్శకుడు. దీనికి సంగీతం కార్తిక్ కొడకండ్ల.
డిసెంబరులో.. ‘అన్నీ మంచి శకునములే’
సంతోష్ శోభన్ (Santosh Sobhan), మాళవికా నాయర్ (Malvika Nair) నాయకానాయికలుగా తెరకెక్కుతున్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). రాజేంద్రప్రసాద్, గౌతమి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నందినిరెడ్డి దర్శకురాలు. మిత్రవిందా మూవీస్తో కలిసి స్వప్న సినిమా పతాకంపై ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం డిసెంబరు 21 విడుదలవుతున్నట్టు సినీవర్గాలు మంగళవారం ప్రకటించాయి. సంగీతం: మిక్కీ జే మేయర్, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి.
వస్తున్నాడు ‘రారాజు’
యశ్ (Yash) కథానాయకుడిగా నటించిన ‘రారాజు’ (Raraju) ఈ నెల 14న విడుదలవుతోంది. పద్మావతి పిక్చర్స్ పతాకంపై తెలుగు రాష్ట్రాల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత వి.ఎస్.సుబ్బారావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘యశ్తోపాటు ఆయన భార్య రాధిక పండిట్ జంటగా నటించిన చిత్రమిది. మహేష్రావు దర్శకత్వం వహించారు. కన్నడలో ఘన విజయం సాధించింది. తెలుగులోనూ తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లిడి గాంధీ, ఘంటాడి కృష్ణ, గురుచరణ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’ - దిల్లీ హైకోర్టు
-
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?