Vishwak Sen: ఆ విషయంలో అదృష్టవంతుడిని!
తొలి అడుగుల్లోనే మాస్ ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విష్వక్సేన్. కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. చేసే పాత్రలతో తన నటనలో ప్రత్యేకతని ఆవిష్కరిస్తుంటాడు. అదే ఆయన్ని విజయాల బాటలో నిలుపుతోంది.
తొలి అడుగుల్లోనే మాస్ ప్రేక్షకులకు చేరువైన కథానాయకుడు విష్వక్సేన్ (Vishwak Sen). కథల ఎంపికలో వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. చేసే పాత్రలతో తన నటనలో ప్రత్యేకతని ఆవిష్కరిస్తుంటాడు. అదే ఆయన్ని విజయాల బాటలో నిలుపుతోంది. విష్వక్ కథానాయకుడిగా పీపీపీ సినిమా పతాకంపై ఇటీవల ‘ఓరి దేవుడా’ (Ori Devuda) తెరకెక్కింది. తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి రీమక్ ఇది. దీపావళి సందర్భంగా శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విష్వక్సేన్ గురువారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
ఎలాంటి వివాదం లేకుండా మీ సినిమా విడుదలవుతోంది. వివాదాలు మీ సినిమాకి మేలు చేస్తుంటాయి కదా?
మేలంటూ ఏమీ లేదు. వివాదం చోటు చేసుకున్నాక నేను భయపడి ఇంట్లో కూర్చున్నానంటే నన్ను సర్దేస్తారు. నేను దాన్ని ఎదుర్కొని, పోరాడి నా తప్పేమీ లేదని నిరూపించుకుంటాను కాబట్టే అది నాకు ప్లస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అయినా ‘హిట్’ ఎలాంటి వివాదం లేకుండా విడుదలై విజయవంతమైంది కదా. పోయినసారి కూడా ప్రాంక్ వీడియో నేను ప్లాన్ చేసిందేమీ కాదు. ప్రచారం అంటే పది చోట్లకి పరిగెత్తుతుంటాం. ఆ క్రమంలో చోటు చేసుకున్న ఓ సంఘటనే ప్రాంక్ వీడియో. అది నేను రాసిందేమీ కాదు.
‘ఓరి దేవుడా’ ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎప్పుడొచ్చింది?
‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ కంటే ముందు ఈ సినిమానే ఒప్పుకున్నా. కానీ మొదట 36 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపించి, ఆ తర్వాత యువకుడిగా కనిపిస్తే బాగుంటుందని... కెరీర్ బ్యాలెన్స్ అవుతుందని మొదట ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’ చేశా. ఈ కథకి నేనైతే బాగుంటానని ఎగ్జిక్యూటివ్ నిర్మాత వంశీ కాక, నిర్మాత పీవీపీ అనుకుని నన్ను సంప్రదించారు. నీకు ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని నిర్మాత చెప్పారు. సినిమా చూసి రెండు రోజుల్లోనే చేస్తానని చెప్పా. సున్నితమైన అంశంతో సాగే కథ ఇది. మాతృకని తీసిన దర్శకుడే ఇక్కడ తీయాలనేది పీవీపీ నిర్ణయం. నిజంగా ఏమాత్రం కదిలించినా చెడిపోయే అవకాశం ఉన్న కథ ఇది. దర్శకుడు అశ్వత్ తమిళంలో పలు పరిమితుల మధ్య సినిమాని తీశారు. కానీ ఇక్కడ అన్నీ పక్కాగా కుదరడంతో ఆ కథని అప్గ్రేడ్ చేసి తీశారు.
వెంకటేష్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ఆయనతో కలిసి చేసిన ఈ ప్రయాణంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి?
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఐదో సినిమానే వెంకటేష్తో కలిసి నటిస్తానని కలలో కూడా అనుకోలేదు. నావరకు ఊహించని పరిణామం. సెట్లో మూడు రోజులు ఆయనతో కలిసి ప్రయాణం చేశా. సినిమాలో ఆయన లుక్, పాత్రలో ఆయన ఉత్సాహం చాలా బాగుంటుంది. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయి. షాట్ విరామంలో వేరేవాళ్లతో కబుర్లు చెబుతూ గడపకుండా సన్నివేశాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆయన్ని చూసి నేర్చుకున్నా. మన పని మనం చేస్తూ వెళ్లినప్పుడు గొప్ప సినిమా మనల్ని వెదుక్కుంటూ వస్తుందని ఆయన సెట్లో చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
మీరు దర్శకత్వం వహించిన ‘దాస్ కా ధమ్కీ’ ఎప్పుడొస్తుంది?
చిత్రీకరణ పూర్తయింది. పలు భాషల్లో ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. తదుపరి నా నుంచి వచ్చే సినిమా అదే. దాని తర్వాత ‘గామి’ అనే మరో సినిమా విడుదలవుతుంది. ‘ఫలక్నామాదాస్ 2’ కూడా ఆలోచన రూపంలో ఉంది. వచ్చే ఏడాది దాన్ని సెట్స్పైకి తీసుకెళతాం.
‘‘కెరీర్ పరంగా ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అనుకోకుండానే జరిగాయి. ఎక్కువ, తక్కువ కాకుండా... పనిచేస్తూ వెళుతున్నానంతే. అయితే ‘ఈ నగరానికి ఏమైంది?’ చేస్తున్నప్పుడు మాత్రం ఓ నిర్ణయం తీసుకున్నా. ముప్పయ్యేళ్ల వయసు వరకు ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత బాక్సాఫీసు, స్టార్ ఇమేజ్ గురించి ఆలోచించాలనుకున్నా. ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలపై సంతృప్తిగా ఉన్నా. ఒకదానికొకటి సంబంధం లేని పాత్రలు చేశా. మరికొన్నాళ్లు ఈ ప్రయాణం ఇదే ప్రవాహంలో సాగుతుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ