కథ కుదిరే.. కలయిక అదిరే
వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు.
వరుస సినిమాలతో తీరిక లేకుండా ఉన్నా.. మరో మంచి కథ దొరికితే చాలు పచ్చజెండా ఊపేయాలని కొందరు. సినీ డైరీ ఖాళీ అయ్యేలోపు ఓ కొత్త కబురు వినిపించాలని మరికొందరు.. ఇలా కథానాయకులంతా కథల వేటలో తలమునకలై ఉన్నారు. ఇందులో కొన్ని ప్రాజెక్ట్లు ఇప్పటికే పక్కా అయినట్లు సమాచారం. అవి త్వరలోనే కార్యరూపంలోకి రానున్నట్లు తెలుస్తోంది.
నాని రొమాంటిక్ కామెడీ
కొత్త ప్రతిభను.. కొత్త కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటారు కథానాయకుడు నాని. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘దసరా’ ఇలాంటి ప్రయత్నమే. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడ్ని తెరకు పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత నాని చేయనున్న కొత్త చిత్రం సైతం ఓ నూతన దర్శకుడే రూపొందించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొన్ని వెబ్సిరీస్లతో నిరూపించుకున్న శౌర్య అనే దర్శకుడు నానికి ఓ కథ వినిపించారని.. అది ఆయనకు నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకరించారని సమాచారం. ఇదొక భిన్నమైన రొమాంటిక్ కామెడీ చిత్రంలా ఉండనున్నట్లు తెలుస్తోంది. దీన్ని చెరుకూరి మోహన్ నిర్మించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, ‘దసరా’ పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రచారం వినిపిస్తోంది.
ఈనెలలోనే శ్రీకారం..
నాగచైతన్య కథానాయకుడిగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. దీని తర్వాత చైతూ చేయనున్న చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు. ఆయన కోసం పరశురామ్ ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించినా.. ఆ తర్వాత దానిపై స్పష్టత రాలేదు. దీనికి తోడు ఇటీవల ఆయన బాలకృష్ణకు ఓ కథ వినిపించనున్నట్లు చెప్పడంతో చైతన్యతో సినిమా లేకపోవచ్చని ప్రచారం వినిపించింది. అయితే ఇప్పుడు నాగచైతన్య - పరశురామ్ల ప్రాజెక్ట్ ఖరారైనట్లు సమాచారం. దీన్ని 14రీల్స్ ప్లస్ పతాకంపై నిర్మించనున్నారు. వెంకట్ ప్రభు సినిమా పూర్తి కాగానే ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది.
శర్వా సిద్ధమే
‘ఒకే ఒక జీవితం’ విజయం శర్వానంద్కు కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఈ జోష్లోనే ఆయన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కించారు. కానీ, అనూహ్యంగా ఆ చిత్రం ఆగిపోవడంతో మళ్లీ కథల వేటలో పడ్డారు శర్వా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ఓ కథకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ‘భలే మంచి రోజు’, ‘దేవదాస్’, ‘హీరో’ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఆయన ఇటీవలే శర్వానంద్కు ఓ కొత్తదనం నిండిన కథ వినిపించినట్లు తెలిసింది. అది శర్వాకు బాగా నచ్చడంతో సినిమాకి పచ్చజెండా ఊపారని సమాచారం. అయితే దీన్ని ఎవరు నిర్మిస్తారన్నది తేలాల్సి ఉంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.
‘భీష్మ’ దర్శకుడితో..
నితిన్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కాగా, ఇప్పుడాయన మరో దర్శకుడికి ఓకే చెప్పినట్లు తెలిసింది. ‘భీష్మ’ చిత్రంతో నితిన్కు విజయాన్ని అందించారు దర్శకుడు వెంకీ కుడుముల. ఈ కలయికలోనే ఇప్పుడు మరో సినిమా పట్టాలెక్కనుందని సమాచారం. స్క్రిప్ట్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్కు నితిన్ ఓకే చెప్పారని తెలిసింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Ram Charan: అభిమానులను కలిసిన రామ్ చరణ్.. ఫ్యాన్స్ కేరింతలు
తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులను ప్రముఖ నటుడు రామ్ చరణ్ కలిశారు. ఇంటి వెలుపలికి వచ్చి వారికి అభివాదం చేశారు. తమ అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు.
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Maidaan: ఆ పాత్రలో ఆయన నటించలేరనుకున్నా : అమిత్ శర్మ
అజయ్ దేవగణ్ అబ్దుల్ రహీంగా నటించలేరని తాను అభిప్రాయపడినట్లు అమిత్శర్మ తెలిపారు. -
Murali Mohan: ఓ పెద్ద హీరో నన్ను శ్రీరామచంద్రుడు అనేవారు!: మురళీమోహన్
తనకు ఆరాధ్య దైవంతో సమానమైన ఓ పెద్ద హీరో.. అమెరికాలో స్టేజిపై తనను శ్రీరామచంద్రుడు అని అన్నారని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ చెప్పారు. తాజాగా ‘ఆలీతో సరదాగా’ సీజన్ 2కు ఆయన అతిథిగా విచ్చేశారు. సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. పూర్తి ఎపిసోడ్ ఏప్రిల్ 2న ప్రసారం కానుంది.
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
NTR 31: రెండు భాగాలుగా రానున్న ఎన్టీఆర్ 31..వైరల్ అవుతోన్న అప్డేట్
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. -
రామ్ చరణ్ బర్త్డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
కుటుంబ సభ్యులు ఆందోళన చెందినా అర్థం చేసుకున్నారు
విభిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడాయన ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) అనే మరో ప్రయోగాత్మక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. -
తంగం కోసం జాన్వీ ఎదురుచూపు
‘దేవర’లో ఎన్టీఆర్కి జోడీగా తంగం పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది బాలీవుడ్ నాయిక జాన్వీ కపూర్. దీన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది -
ముగింపు వరకూ కనిపెట్టలేం
‘‘ఎలాంటి పాత్రనైనా చేయగలడనే పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. అందుకే నటన పరంగా సవాళ్లు ఎదురవుతాయని తెలిసినా ఓ బలమైన నమ్మకంతో ఈ సినిమా చేశా -
మరోసారి థ్రిల్లర్ కథలో!
నాగచైతన్య థ్రిల్లర్ కథలతో ఎంతగా ప్రభావం చూపిస్తారో ఇటీవల విడుదలైన ‘దూత’ సిరీస్ చాటి చెప్పింది. అన్నీ కుదిరితే అలా వెండితెరపై ఆయన పక్కా థ్రిల్లర్ కథతో సందడి చేసే అవకాశాలున్నాయి -
మమ్మల్ని ఆపేదెవరు?
‘ఒకరి కోసం మరొకరు ప్రాణాలు వదులుకునేంత మంచి స్నేహితులం మేము. అవసరమైతే దేశం కోసం ఒకరినొకరం చంపుకోవడానికైనా వెనకాడమ’ని అంటున్నారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ -
నటిగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టా
నటనపై తనకున్న ప్రేమ... ఆసక్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తనని తెలుగు చిత్ర పరిశ్రమకి వచ్చేలా చేసిందన్నారు ప్రశాంతి హారతి. వివాహం, కుటుంబ బాధ్యతల వల్లే ఇరవయ్యేళ్లుగా నటనకు దూరం కావల్సి వచ్చిందన్నారామె. -
తెలుగులోకి ‘మంజుమ్మల్ బాయ్స్’
మలయాళ చిత్రసీమలో సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. చిదంబరం ఎస్ పొదువల్ తెరకెక్కించిన ఈ సినిమాని ఇప్పుడదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది -
అంతా మనమే... ఇక నా మాటే
శర్వానంద్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు