Super star Krishna: నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ..
పసందైన పాటలకు నెలవు కథానాయకుడు కృష్ణ చిత్రాలు. మంచి సంగీతాభిరుచి కలిగిన ఆయన.. తన సినిమాల పాటల ఎంపికలో ఎంతో ప్రత్యేకత కనబర్చేవారు. అందుకే ఆయన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అప్పట్లో కృష్ణ చిత్రాల పాటల క్యాసెట్లకు, పాటల పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది.
పసందైన పాటలకు నెలవు కథానాయకుడు కృష్ణ చిత్రాలు. మంచి సంగీతాభిరుచి కలిగిన ఆయన.. తన సినిమాల పాటల ఎంపికలో ఎంతో ప్రత్యేకత కనబర్చేవారు. అందుకే ఆయన సినిమాల్లో సింహభాగం మ్యూజికల్ హిట్లుగా నిలిచాయి. అప్పట్లో కృష్ణ చిత్రాల పాటల క్యాసెట్లకు, పాటల పుస్తకాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. ‘సాక్షి’లోని ‘‘అమ్మ కడుపు చల్లగా..’’ పాట నుంచి.. ‘సింహాసనం’లోని ‘‘జింతాన జింతాన’’ పాట వరకు వందల చిత్రాల్లో ఎన్నో విజయవంతమైన పాటలు వినిపించారు కృష్ణ. ఆయన చేసిన ‘దేవదాస్’ బాక్సాఫీస్ ముందు చేదు ఫలితాన్ని అందుకున్నా.. సంగీత పరంగా చక్కటి ఆదరణనే దక్కించుకుంది. అందులోని ‘‘కల చెదిరింది.. కథ మారింది.. కన్నీరే ఇక మిగిలింది’’ పాట అప్పట్లో ప్రతి చోటా వినిపించేది. ‘అవేకళ్లు’లోని ‘‘మా ఊళ్లో ఒక పడుచుంది..’’, ‘పండంటి కాపురం’లోని ‘‘బాబూ వినరా..’’, ‘‘మనసా కవ్వించకే’’, ‘మీనా’లోని ‘‘పెళ్లంటే నూరేళ్లపంట’’ గీతాలు ఇప్పటికీ వీనుల విందుగా వినిపిస్తూనే ఉంటాయి. ‘దేవుడు చేసిన మనుషులు’లోని ‘‘మసక మసక చీకటిలో’’, ‘ఊరికి మొనగాడు’లోని ‘‘ఇదిగో తెల్లచీర.. అదిగో మల్లెపూలు’’ వంటి గీతాలు అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇక కృష్ణ.. రచయిత సి.నారాయణరెడ్డిలది పాటల పరంగా సూపర్ హిట్ కాంబినేషన్. కృష్ణ నటించిన పలు చిత్రాలకు ప్రాచుర్యం పొందిన ఎన్నో పాటల్ని అందించిన కలం సినారేదే. ‘‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’’ (మంచి మిత్రులు), ‘‘గువ్వలా ఎగిరిపోవాలి’ (అమ్మకోసం), ‘‘వస్తాడు నా రాజు ఈరోజు’’ (అల్లూరి సీతారామరాజు), ‘‘మ్రోగింది కల్యాణ వీణ’’ (కురు క్షేత్రం), ‘‘బుగ్గ గిల్లగానే’’ (ముహూర్తబలం), ‘‘పాలరాతి మందిరాన’’ (నేనూ మనిషినే), ‘‘చందమామ రమ్మంది చూడు’’ (అమాయకుడు) వంటి గీతాలు నాటి తరం ప్రేక్షకుల మదిలో ఆణిముత్యాల్లా నిలిచిపోయాయి. ‘‘మల్లెపందిరి నీడలో’’ (మాయదారి మల్లిగాడు), ‘‘నవ్వుతూ బతకాలి రా.. తమ్ముడూ నవ్వుతూ చావాలిరా’’ పాటలు ఇప్పటికీ మళ్లీ మళ్లీ వినాలనిపించేవే. కృష్ణ సినిమాల్లో వినిపించిన పాటలన్నీ ఒకెత్తైతే.. ‘అల్లూరి సీతారామరాజు’లోని ‘‘తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా’ గీతం మరో ఎత్తు. మహాకవి శ్రీశ్రీ కలం నుంచి జాలువారిన ఈ స్ఫూర్తిదాయక గీతానికి జాతీయ పురస్కారం దక్కింది. తెలుగులో జాతీయ అవార్డు అందుకున్న తొలి పాట ఇదే. ‘సింహాసనం’ సినిమాతో సంగీత దర్శకుడు బప్పీలహరిని తెలుగు తెరకు పరిచయం చేశారు కృష్ణ. ‘గౌరీ’ చిత్రంలోని ‘‘గల గల పారుతున్న గోదావరిలా’’, ‘సింహాసనం’లోని ‘‘ఆకాశంలో ఒక తార’’, ‘పచ్చని కాపురం’లోని ‘‘వెన్నెలైనా చీకటైనా..’’ వంటి గీతాలు రీమిక్స్ రూపంలోనూ ఈతరం ప్రేక్షకుల మదిపైనా చెరగని ముద్ర వేశాయి.
రికార్డుల అసాధ్యుడు
ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో.. 360 చిత్రాల్లో నటించిన కృష్ణ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. వాటిలో ముఖ్యమైనవి ఇవి...
* 1983లో ఒకే నగరంలో (విజయవాడ)లో ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్న ఏకైక ఇండియన్ హీరో.
* 1972లో ఒకే ఏడాదిలో అత్యధికంగా 18 చిత్రాలు విడుదలయ్యాయి.
* కృష్ణ హీరోగా కె.యస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమాల సంఖ్య: 31
* కృష్ణతో పనిచేసిన సంగీత దర్శకులు : 52
* 1965 నుంచి 2009 వరకు 44 సంవత్సరాలు ఏ ఏడాదిలోనూ గ్యాప్ రాకుండా నటించిన ఏకైక హీరో.
* 44ఏళ్లలో సంక్రాంతి రోజు రిలీజైన సినిమాల సంఖ్య: 30
* కృష్ణ తెరకెక్కించిన తొలి సినిమా ‘సింహాసనం’ విడుదలైన థియేటర్ల సంఖ్య: 50
* కృష్ణతో నటించిన కథానాయికలు: 80
*కృష్ణ, జయప్రద కాంబినేషన్లో వచ్చిన సినిమాలు: 43
* కృష్ణ, శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రాలు: 31
* ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు: 25
* త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు: 7
కృష్ణ తల్లి కోరికే ‘ముగ్గురు కొడుకులు’
కృష్ణ సినిమాల్లోకి రావడం వెనక ఆయన తల్లి నాగరత్నమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. కృష్ణ హీరోగా ఎదిగాకా ఆమె కోరిక ఒకదాన్ని దర్శకుడు పీసీ రెడ్డితో ‘ముద్దుబిడ్డ’ సినిమా షూటింగులో చెప్పారట. ‘‘నాకు ముగ్గురు కొడుకులు కదా. ముగ్గురు కొడుకుల నేపథ్యంలో ఓ కథ తయారు చేయకూడదా!’ అని పీసీరెడ్డిని అడిగితే ఆయన అరగంటలో కథ చెప్పారట. ఆ చిత్రమే కృష్ణ దర్శకత్వం వహించిన ‘ముగ్గురు కొడుకులు’. అందులో కృష్ణతో పాటు రమేష్బాబు, మహేష్బాబులు నటించారు.
కథానాయకుడిగానే..
కృష్ణ దాదాపు 350 సినిమాల్లో నటించారు. అందులో తొంభైశాతం హీరో, కీలక పాత్రలే. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినవారు అరుదు. మొదటి సినిమా 1961 నుంచి 2016లో విడుదలైన ‘శ్రీశ్రీ’ వరకు ఆయనది యాభై రెండేళ్ల సుదీర్ఘ కెరీర్. ఇందులో 25 చిత్రాల్లో ద్విపాత్రాభినయం, ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేశారు. భార్య విజయనిర్మలతో కలిసి ఏకంగా 49 సినిమాల్లో నటించారు.
తప్పిన ప్రాణగండం
విజయనిర్మలతో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘అమ్మ కోసం’. ఆ సినిమా షూటింగ్ రాజమండ్రి దగ్గర్లోని పాపికొండల్లో జరిగింది. ఆర్టిస్టులందరికీ అక్కడే వసతి ఏర్పాటు చేశారు. కృష్ణ, విజయనిర్మల కొత్త జంట కావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక బోట్హౌజ్ తయారు చేయించి దాన్ని గోదావరిలో తేలియాడేలా ఏర్పాటు చేశారు. తాళ్లతో ఒడ్డున ఉన్న చెట్లకు కట్టేశారు. ఒకరోజు పెద్ద తుపాను, వర్షం వచ్చి ఆ బోటులోకి నీళ్లు వచ్చాయి. కృష్ణ, విజయనిర్మల ఇద్దరికీ ఈత రాదు. ఒడ్డున ఉన్నవాళ్లు హాహాకారాలు చేయసాగారు. ప్రాణాలు వదిలేసుకున్న ఆ సమయంలో స్టంట్మాస్టర్ రాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బోటుకి తాళ్లు కట్టి వాటిని నాలుగు గుర్రాలకి బిగించి ఒడ్డుకు లాక్కొచ్చారు.
మీసాల కృష్ణుడి మహిమతో..
కృష్ణ - విజయనిర్మలను ‘ఆంధ్రా ప్రేమ్ నజీర్ - షీలా’ జోడీగా పిలిచేవారు. అయితే వీరి పెళ్లి వెనుక ‘మీసాల కృష్ణుడు’ మహిమ ఉందని కృష్ణ ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘నేను.. విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. ఆ సినిమా చిత్రీకరణ మొత్తం రాజమండ్రి దగ్గర్లోని ‘పులిదిండి’లో జరిగింది. ఆ ఊర్లో మీసాల కృష్ణుడు గుడి ఉంది. అందులో ఓ సూపర్ హిట్ పాట చిత్రీకరణ జరిగింది. ఆరుద్ర రాసిన ‘అమ్మ కడుపు చల్లగా’ అనే పాటలో పెళ్లి వేడుక తతంగం మొత్తాన్నీ నాపైనా.. విజయనిర్మల మీద చాలా శాస్త్రోక్తంగా చిత్రీకరించారు బాపు. ఆ పాట చిత్రీకరణ సమయంలో రాజబాబు ‘ఈ గుడి చాలా మహిమాన్వితమైనది. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్లి.. తొందర్లోనే నిజం పెళ్లి అవుతుంది’ అన్నారు. అందరం సరదాగా నవ్వుకున్నాం. కానీ, సెంటిమెంట్స్ను నమ్మని నేను కూడా ఆశ్చర్యపోయేలా మా అనుబంధం నిజంగానే పెళ్లికి దారి తీసింది. 1969 మార్చి 24న తిరుపతిలో మా పెళ్లి జరిగింది’’ అంటూ ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు కృష్ణ.
అగ్గిపెట్టుందా...
కథానాయకుడు కృష్ణ నటన, హావభావాలు, ఆయన నృత్యాలు, సంభాషణలు చెప్పే విధానం ప్రత్యేకం. ఈతరం కుర్రకారు సైతం ఆయన హావభావాల్ని అనుకరిస్తుంటారు. ఆయన తొలినాళ్లల్లోనే సినిమాల్లో సుదీర్ఘమైన సంభాషణల్ని పలికి ప్రేక్షకుల్ని అలరించారు. ‘అగ్నిపర్వతం’ సినిమాలో అగ్ని జమదగ్ని... అంటూ అగ్గిపెట్టె అడిగే సన్నివేశాలు, ‘వీళ్లు అడ్రస్ లేనివాళ్లు కాదు ఆఫీసర్...’, ‘కన్నీటికి అర్థం తెలిసిన మనుషులు, కష్టానికి నిర్వచనం తెలిసిన మనుషులే ఇలాంటి సాయం చేస్తారు ఆఫీసర్’ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు అప్పట్లో పాపులర్ అయ్యాయి. వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’లో ‘ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒకొక్క విప్లవవీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెళ్లగి స్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు.. సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్య్ర నినాదం. స్వేచ్ఛా మారుతం. ఈ మట్టిలో మట్టినై... నీటిలో నీటినై... నా ప్రజల ఊపిరిలో ఊపిరినై, మనుషుల్లో భావాన్నై, హృదయాల జ్వాలనై... నా జాతి జనులు పాడుకునే సమరగీతాన్నై... సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా ఇక్కడ కాల్చు... వందే మాతరం’ అంటూ ఆయన చెప్పిన సంభాషణలు ప్రేక్షకుల్ని ఉద్రేకానికి గురిచేశాయి. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. 200వ చిత్రం ‘ఈనాడు’లోనూ ఆయన చెప్పిన సంభాషణలు అంతే శక్తివంతంగా సాగుతాయి. ‘ఈ చేతులు పేదవాడి ఆక్రోశంతో రాటు దేలిపోయాయి. దగా పడిన తమ్ముళ్ల ఆవేదనతో కరుకు తేలిపోయాయి’, ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదులే చీకటి మాటుకు పారిపోయారు, నువ్వెంత? పర్వతంలో పరమాణువులాంటివాడివి, సముద్రంలో ఇసుక రేణువులాంటివాడివి’ అనే సంభాషణల్ని కృష్ణ చెప్పిన తీరు ప్రత్యేకం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేమేం ప్రాణస్నేహితులం కాము.. ఆ హీరోతో కెమిస్ట్రీపై రాశీఖన్నా కామెంట్స్..
సిద్ధార్థ్ మల్హోత్ర కూడా తనలాగే అందరితో త్వరగా కలిసిపోరని నటి రాశీ ఖన్నా అన్నారు. -
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ప్రేమ పెళ్లికే తాను ఓటు వేస్తానని చెప్పారు. -
దక్షిణాది నటీనటులకేం తక్కువ.. సౌత్ వర్సెస్ నార్త్పై ప్రియమణి కామెంట్స్
దక్షిణాది నటీనటులు అన్ని భాషల్లోనూ రాణిస్తున్నారని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నానంటూ జరుగుతోన్న ప్రచారంపై నటి అనసూయ (Anasuya) స్పందించారు. -
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!