Actress: మనసంతా ‘నాయికా’ కథలే!
కొన్నేళ్లుగా చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు పెరిగింది. అనుష్క, సమంత, కీర్తి సురేష్ వంటి స్టార్ నాయికల మొదలు.. కొత్తగా వచ్చిన నాయికల వరకు ఎవరి స్థాయికి తగ్గ కథలు వారికి సిద్ధమవుతున్నాయి.
కొన్నేళ్లుగా చిత్రసీమలో నాయికా ప్రాధాన్య చిత్రాల జోరు పెరిగింది. అనుష్క, సమంత, కీర్తి సురేష్ వంటి స్టార్ నాయికల మొదలు.. కొత్తగా వచ్చిన నాయికల వరకు ఎవరి స్థాయికి తగ్గ కథలు వారికి సిద్ధమవుతున్నాయి. దీంతో నాయికా ప్రధానమైన సినిమాల సందడి అంతకంతకు రెట్టింపవుతోంది. మంచి విజయాలు దక్కుతుండటంతో నాయికలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కమర్షియల్ హీరోయిన్ పాత్రలు చేస్తున్నా చాలామంది నాయికల మనసంతా హీరోయిన్ ఓరియెంటెడ్ కథల మీదే ఉంటుంది. తెలుగులో ఇప్పటికే కొన్ని నాయికా ప్రాధాన్య సినిమాలు సెట్స్పై ముస్తాబవుతుండగా.. ఇప్పుడు మరికొన్ని కథలు కార్యరూపం దాల్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ కథలోకి సామ్!
నాయికా ప్రాధాన్య చిత్రాలతో జోరు చూపిస్తోంది సమంత. ఆమె టైటిల్ పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో చేసిన ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా.. ఇప్పుడామె కోసం మరో నాయికా ప్రాధాన్య కథ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘చిలసౌ’ సినిమాతో తొలి అడుగులోనే దర్శకుడిగా మెప్పించిన రాహుల్ రవీంద్రన్. ఆ వెంటనే నాగార్జునతో ‘మన్మథుడు 2’ చేసే అవకాశం అందుకున్నారు. కానీ, అది ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఆయన ఓ నాయికా ప్రాధాన్య కథను సిద్ధం చేసుకొని రష్మికకు వినిపించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడా కథనే రాహుల్ మార్పులు చేసి సమంతకు వినిపించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై సామ్ కూడా సానుకూలంగా స్పందించిందని టాక్. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. గీతా ఆర్ట్స్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో ‘ఖుషి’లో నటిస్తోంది. హిందీలో ఓ వెబ్సిరీస్ చేస్తోంది.
జోరు పెంచుతోన్న లావణ్య..
‘అందాల రాక్షసి’ చిత్రంతో తెలుగు సినీప్రియులకు దగ్గరైంది లావణ్య త్రిపాఠి. రామ్, నాని, వరుణ్ తేజ్.. ఇలా వరుసగా యువ హీరోలతో కలిసి సందడి చేసింది. అయితే ఇటీవల కాలంలో వరుస పరాజయాలు పలకరించడంతో కథల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మొదలు పెట్టింది లావణ్య. దీంతో సినిమాల పరంగా ఆమె జోరు కాస్త తగ్గింది. అయితే ఇప్పుడామె రెండు నాయికా ప్రాధాన్య కథలకు పచ్చజెండా ఊపిందని సమాచారం. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా.. మరొకటి తమిళ చిత్రం. తెలుగు ప్రాజెక్ట్కు మంజునాథ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్ ఆమెకు నచ్చడంతో ఓకే చెప్పిందని తెలిసింది. దీన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించనున్నారని సమాచారం. లావణ్య ప్రస్తుతం తెలుగులో ‘పులి మేక’ అనే వెబ్సిరీస్లోనూ నటిస్తోంది. ఇది త్వరలో జీ5 ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘సీతారామం’ నిర్మాతలతో మరోసారి!
‘సీతారామం’ సినిమాతో దక్షిణాది ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మరాఠీ భామ మృణాల్ ఠాకూర్. ఆ చిత్రంతో ఆమె తొలి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని అందుకున్నా.. ఇంత వరకు మరో కొత్త కబురు వినిపించలేదు. ఒక మహిళా దర్శకురాలితో ఓ నాయికా ప్రాధాన్య చిత్రం చేయనున్నట్లు గతంలో వార్తలు వినిపించినా.. ఇంత వరకు స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం ఆమె వైజయంతీ మూవీస్ సంస్థలోనే తన రెండో చిత్రం చేయనుందని సమాచారం. ఓ బలమైన నాయికా ప్రాధాన్య కథతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించనున్నారని, ప్రస్తుతం సరైన స్క్రిప్ట్ను వెతికి పట్టుకునే పనిలో ఉన్నారని తెలిసింది. మరి ఈ సినిమాని తెరకెక్కించే దర్శకులెవరు, ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అన్నది తేలాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత