Tollywood: ‘భయమే’ కానీ.. వినోదమే!
విభిన్న భావోద్వేగాల సమాహారం సినిమా. కాసేపు హాయిగా నవ్వుకోవాలని కొందరు.. థ్రిల్ను ఆస్వాదించాలని మరికొందరు.. మదిని బరువెక్కించే భావోద్వేగభరిత కథల్లో మునిగితేలాలని ఇంకొందరు.. ఓ సినిమా చూసేందుకు ఎవరి కారణాలు వాళ్లవి.
కొత్త హంగులతో హారర్ కథలు
విభిన్న భావోద్వేగాల సమాహారం సినిమా. కాసేపు హాయిగా నవ్వుకోవాలని కొందరు.. థ్రిల్ను ఆస్వాదించాలని మరికొందరు.. మదిని బరువెక్కించే భావోద్వేగభరిత కథల్లో మునిగితేలాలని ఇంకొందరు.. ఓ సినిమా చూసేందుకు ఎవరి కారణాలు వాళ్లవి. అయితే కొన్ని చిత్రాలకు కేవలం తనివితీరా భయపడేందుకే వెళ్తారు. మనిషిలో అంతర్లీనంగా ఉండే భయాన్ని సంతృప్తి పరచేందుకే ఇదంతా. అందుకే భయం కూడా వెండితెరపై ఓ కమర్షియల్ ఎలిమెంట్గా మారిపోయింది. అయితే గతంలో హారర్ కథలంటే పూర్తిగా దెయ్యాల సినిమాలే కనిపించేవి. కానీ, ఇప్పుడలా అనుకోవడానికి లేదు. ప్రేక్షకుల్ని సీటు మీద కూర్చోనివ్వకుండా, మునివెళ్లపై నిలబడేటట్లు చేస్తూ.. ఏసీలోనూ చెమటలు పట్టించే ప్రతి సినిమా భయపెట్టేదే. తర్వాత ఇలా జరుగుద్దేమో అని ఓ క్లూ ఇచ్చి.. మన ఆలోచనలకు అందని విధంగా కథ నడిపి, షాక్ ఇచ్చేవన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడిలాంటి కథలతోనే భయపెడుతూ.. వినోదాలు పంచేందుకు పలువురు నాయకానాయికలు సిద్ధమవుతున్నారు. మరి ఆ చిత్రాలేంటి? వాటి విశేషాలేంటి?
ఇప్పుడు తెరపై అంతగా కనిపించడం లేదు కానీ, ఓ ఆరేడేళ్లు వెనక్కి వెళ్తే హారర్ చిత్రాల జోరు తెలుగు నాట బాగా కనిపించింది. ‘కాంచన’, ‘వైషాలి’, ‘ప్రేమకథా చిత్రమ్’, ‘గీతాంజలి’ చిత్ర విజయాల స్ఫూర్తితో అప్పట్లో లెక్కకు మిక్కిలిగా రకరకాల హారర్ సినిమాలు వెండితెరపైకి వరుస కట్టాయి. దీంతో ఓ దశలో ఆ జానర్పై ప్రేక్షకుల ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడిలాంటి భయపెట్టే కథలు కొత్తదనం అద్దుకొని మిస్టీక్ థ్రిల్లర్స్, సూపర్ నేచురల్ థ్రిల్లర్స్ రూపాల్లో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు కథానాయకుడు ప్రభాస్. ఇప్పటికే ‘ఆదిపురుష్’ చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన.. ఇప్పుడు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలతో సెట్స్పై తీరిక లేకుండా గడుపుతున్నారు. వీటితో పాటు ఆయన మారుతి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. హారర్ అంశాలతో నిండిన ఓ వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ కూడా పూర్తయింది. ఇందులో ముగ్గురు కథానాయికలకు అవకాశముంది. వీటిలో రెండు పాత్రల కోసం నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటు ప్రేమకథలతోనూ.. అటు యాక్షన్ కథలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించిన కథానాయకుడు సాయి తేజ్. ఇప్పుడాయన భయపెడుతూ.. వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 15వ చిత్రం సెట్స్పై ముస్తాబవుతోంది. దీన్ని కార్తిక్ దండు తెరకెక్కిస్తున్నారు. సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో నిండిన థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ప్రేక్షకుల్ని భయపెట్టి.. ఉత్కంఠతకు గురిచేసే అంశాలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యభరితమైన కథలకు చిరునామాగా నిలిచే హీరో సందీప్ కిషన్. ‘నిను వీడని నీడను నేనే’ అంటూ గతంలో ఓ హారర్ కథతో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన.. ఇప్పుడు ‘ఊరు పేరు భైరవకోన’తో మరోసారి భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వి.ఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సూపర్ నేచురల్ ఫాంటసీ థ్రిల్లర్ ఇది. గ్రాఫిక్స్కు ఎంతో ప్రాధాన్యముంది. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాయికలూ సై..
అందచందాలతో అలరించే కథానాయికలూ.. ఇప్పుడు ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నటి కాజల్. వాటిలో ‘ఘోస్టీ’ ఒకటి కాగా.. మరొకటి ‘కరుంగాప్పియమ్’. ఈ రెండూ హారర్ నేపథ్యంలో సాగే చిత్రాలే. వినోదం నిండిన ఓ ఆసక్తికర హారర్ కథాంశంతో కల్యాణ్ తెరకెక్కించిన చిత్రం ‘ఘోస్టీ’. ఇందులో పోలీస్గా సందడి చేయనుంది కాజల్. ఇక దర్శకుడు డీకే తెరకెక్కించిన మరో తమిళ చిత్రం ‘కరుంగాప్పియమ్’. ఇందులో కాజల్ అగర్వాల్తో పాటు రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలో కొన్ని అతీంద్రియ శక్తులున్న యువతిగా కాజల్ కనువిందు చేయనున్నట్లు తెలిసింది. రజనీకాంత్ - పి.వాసుల కలయికలో రూపొందిన కామెడీ హారర్ చిత్రం ‘చంద్రముఖి’. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో ‘చంద్రముఖి2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో నాయికగా కాజల్ పేరునే పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’ వంటి హారర్ కథా చిత్రాలతో ప్రేక్షకుల్ని భయపెట్టిన అందాల నాయిక నయనతార. ఇప్పుడు ‘కనెక్ట్’తో మరోసారి అదే రీతిలో భయపెడుతూ.. థ్రిల్ పంచేందుకు సిద్ధమవుతోంది. అశ్విన్ శరవణన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ హారర్ కథా చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: నేను కూడా జంక్ఫుడ్ తిన్నా.. కానీ: విరాట్ కోహ్లీ
-
India News
Nirmala Sitharaman: బడ్జెట్ వేళ..ప్రత్యేక ఆకర్షణగా నిర్మలమ్మ చీరకట్టు..!
-
Politics News
Kotamreddy: అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాప్ చేస్తే?: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
Movies News
Varun Tej: మెగా నివాసంలో పెళ్లి బాజాలు.. వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు స్పష్టత
-
Ap-top-news News
Andhra News: బాలిక కడుపు నుంచి కిలోకు పైగా జుత్తు తొలగింపు
-
Movies News
Asha Saini: ఆ నిర్మాత నన్ను హింసించాడు.. ఆశా సైనీ షాకింగ్ కామెంట్స్..