janhvi kapoor: తొందర్లోనే ఆ కోరిక నెరవేరాలి!
శ్రీదేవి తనయగానే కాకుండా... కథానాయికగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది జాన్వీకపూర్. వరుసగా సినిమాలు చేస్తూ కథల ఎంపికలో ఈమె అభిరుచి ప్రత్యేకం అని నిరూపిస్తోంది.
శ్రీదేవి తనయగానే కాకుండా... కథానాయికగా తనదైన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది జాన్వీకపూర్ (Janhvi Kapoor). వరుసగా సినిమాలు చేస్తూ కథల ఎంపికలో ఈమె అభిరుచి ప్రత్యేకం అని నిరూపిస్తోంది. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్న జాన్వీ... ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె విలేకర్లతో ముచ్చటించింది.
మీ దృష్టిలో ఫ్యాషన్ అంటే?
సౌకర్యవంతమే. మనం ఏది ధరిస్తే సౌకర్యంగా ఉంటుందో అదే మనకు అందాన్ని తీసుకొస్తుందని నమ్ముతాను. పర్యావరణ హితమైన సస్టైనబుల్ ఫ్యాషన్ని ఇష్టపడతాను. ఆ క్షణంలో నాకు ఏది ధరించాలనిపిస్తే అది ధరిస్తాను తప్ప, ప్రత్యేకంగా ప్రణాళికలంటూ ఏమీ ఉండవు.
ఫ్యాషన్, స్టైలింగ్ లాంటి విషయాల్లో మీకు స్ఫూర్తి ఎవరు?
నా చెల్లెలు ఖుషి. స్టైల్ విషయంలో తన అభిరుచి నాకు నచ్చుతుంది. నా స్టైల్కి సంబంధించి తను అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. నేను ఏది ధరించినా అది బాగుందో లేదో తనే చెబుతుంటుంది. నేను దూరంగా ఉన్నా తనకి ఫొటో తీసి పంపుతుంటా. మా అమ్మకి కూడా డ్రెస్ అప్ అవ్వడంపై చాలా శ్రద్ధ తీసుకునేవారు. తన
సినిమాల చిత్రీకరణలకి వెళుతూ పరిశీలించేవాళ్లం. దుస్తులు ధరించడం గురించి మాతో అమ్మ చాలా బాగా చర్చించేవారు.
గత చిత్రం ‘మిలి’ అనుకున్న ఫలితాన్నిచ్చిందా? బాలీవుడ్ ప్రయాణం ఎలా ఉంది?
ఇప్పుడే నా ప్రయాణం మొదలైంది. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. థియేటర్కి వెళుతున్న ప్రేక్షకుల అభిరుచుల్లోనూ, పరిశ్రమలోనూ సమూలమైన మార్పులు చోటు చేసుకుంటున్న సమయం ఇది. ‘మిలి’ నుంచి ఇంకా ఎక్కువ ఆశించా. ఆ నంబర్లు కనిపించలేదేమో కానీ, ప్రేక్షకుల ప్రేమ, గౌరవం లభించాయి. కథల ఎంపికలో సహజత్వం, నవతరం పోకడలు...ఈ రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తుంటా.
తెలుగులో ఎప్పుడు నటిస్తారనే ప్రశ్న తరచూ మీకు ఎదురవుతోంది కదా? దానిపై మీ అభిప్రాయం?
నేను కూడా ఎదురు చూస్తున్నా. తొందరలోనే ఆ కోరిక నెరవేరాలని దేవుణ్ని కోరుకుంటున్నా (నవ్వుతూ). హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. మా నాన్న సినిమాల చిత్రీకరణలు ఇక్కడ జరుగుతున్నప్పుడు మేం తరచూ వచ్చేవాళ్లం. చాలా సమయం ఇక్కడ గడిపా. మేం ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా, తిరిగి వెళ్లేటప్పుడు తిరుపతిలో దిగాల్సిందే. మేం తరచూ సందర్శించే మరో ప్రదేశం... తిరుపతి. ఆ ప్రాంతంతో నాకు చాలా అనుబంధం ఉంది.
హిందీలోనూ ఈమధ్య దక్షిణాది చిత్రాల ప్రస్తావన ఎక్కువగా వినిపిస్తోంది కదా!
నేను కూడా దక్షిణాది అమ్మాయినే. ఇటువైపు ఘనమైన వారసత్వం ఉంది. నేను కూడా ఈ సంస్కృతిలో భాగమే అని నమ్ముతుంటా. దాంతో అనుకోకుండానే నాలో ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. ఉత్తరాదిలో దక్షిణాది చిత్రాలు సాధిస్తున్న విజయాలపై గర్వపడుతున్నా. ఎప్పట్నుంచో ఇక్కడి చిత్రాలు అక్కడ ఆడుతున్నాయి. కానీ ఈమధ్య ఫలితాలు ఇంకా ఘనంగా ఉన్నాయి. దక్షిణాది నుంచి వచ్చిన చిత్రం అంటే కచ్చితంగా వినోదం ఉంటుందని నమ్ముతున్నారు ప్రేక్షకులు. ఆ స్థాయి సినిమాలొస్తున్నాయి. ఇక్కడి పరిశ్రమ ఆ స్థాయి ప్రతిభని ప్రదర్శిస్తోంది. భాష పరంగా హద్దులేవీ లేకుండా సినిమాలు చేయాలనేదే నా లక్ష్యం కూడా.
ఇప్పటిదాకా మీరు చేసిన పాత్రల్లో కష్టంగా అనిపించింది ఏమిటి?
ఇప్పుడు చేస్తున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సినిమాలోని పాత్రే. ఈ సినిమా కోసం నేను క్రికెట్ నేర్చుకోవల్సి వచ్చింది. ఆ క్రమంలో నా భుజానికి గాయమై చాలా ఇబ్బంది పడ్డా. చిత్రీకరణలోనూ చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి.
లేనిది ఉన్నట్టు మాట్లాడేవాళ్లతో అందరూ విసిగిపోయారు. నేను కూడా అలా ఉంటూ విసిగిపోయా. కొన్నిసార్లు తప్పు అయినా సరే, మన మనసులో ఉన్నదే మాట్లాడాలంటాను. నా మనసులో లేనిది నేనస్సలు చెప్పలేను. ఆ నడవడిక అందరికీ అలవాటైతే మంచిది. తప్పులు చోటు చేసుకున్నా సరే, వాటి నుంచి నేర్చుకోవడం మంచిది కదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ