Vishnu Vishal: నా మనసులో రవితేజకు ఎప్పుడూ ప్రత్యేక స్థానమే
ఒకొక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు... విష్ణు విశాల్. గుత్తా జ్వాలని వివాహం చేసుకున్న ఆయన... తెలుగులో రానాతో కలిసి ‘అరణ్య’ చిత్రంతో సందడి చేశారు.
ఒకొక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువవుతున్న కథానాయకుడు... విష్ణు విశాల్. గుత్తా జ్వాలని వివాహం చేసుకున్న ఆయన... తెలుగులో రానాతో కలిసి ‘అరణ్య’ చిత్రంతో సందడి చేశారు. ఆ తర్వాత ‘ఎఫ్.ఐ.ఆర్’. ఇప్పుడు ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). చెల్లా అయ్యవు దర్శకత్వం వహించిన ‘మట్టి కుస్తీ’ డిసెంబరు 2న రానుంది. హీరో రవితేజతో కలిసి స్వయంగా నిర్మించారు విష్ణు విశాల్ (Vishnu Vishal). ఈ సందర్భంగా ఆయన శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘పేరు చూసి ఇది ఆట నేపథ్యంలో సాగే సినిమానా అని అడిగారు చాలామంది. నేను తమిళంలో క్రికెట్, కబడ్డీ నేపథ్యంలో సినిమాలు చేయడం కూడా అందుకు ఓ కారణం. ఇది హాస్యం ప్రధానంగా సాగే భార్యాభర్తల ప్రేమకథ. నా కెరీర్లో నేను చేసిన తొలి మాస్ మసాలా సినిమా ఇదే. కథానాయిక కేరళ అమ్మాయి. అక్కడ మట్టి కుస్తీ అనే ఓ ఆట ఉంది. ఆ ఆటతో భార్యాభర్తల కథని ముడిపెట్టాం. ఇంకా ఈ సినిమాలో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉంటాయి. కథలో భాగంగా వచ్చే వాటన్నిటినీ తెరపై చూస్తేనే మజా. ట్రైలర్లో చూపించని విషయాలు సినిమాలో చాలా ఉంటాయి. నా కెరీర్లో ఓ ట్రైలర్ని కట్ చేయడానికి నెలల సమయం పట్టింది ఈ సినిమాకే. ‘వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమని చెప్పారు, కానీ రెండు అబ్ధాలు ఆడి ఈ పెళ్లి చేశాం’ అనే సంభాషణ ఇందులో ఉంటుంది. ఆ రెండు అబద్ధాలు ఏమిటనేది కూడా కీలకం. భార్యాభర్తల మధ్య అహం, దాంతో వచ్చే సమస్యల్ని వినోదాత్మకంగా చర్చించాం. ఆడవాళ్లు ఎప్పుడూ మన నియంత్రణలో ఉండాలని మగాళ్లు భావిస్తుంటారు. ఆ అంశంపై ఓ మంచి సందేశం కూడా ఉంది. సున్నితమైన భావోద్వేగాలు, కడుపుబ్బా నవ్వించే హాస్యం, అందరికీ చేరువయ్యే కథ, కథనాలున్న చిత్రమిది’’.
అభ్యంతరకరమైతే తిరస్కరిస్తుంటా
‘‘సమాజంపై సినిమా ప్రభావం చాలా ఉంటుందని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకుడిని తప్పు దారి పట్టించేలా ఏ చిన్న విషయం కూడా ఉండకూడదని భావిస్తుంటా. నా దగ్గరికొచ్చే కొన్ని కథలు చేస్తే తప్పకుండా విజయవంతం అవుతాయని ముందే తెలుసు. కానీ ఆ కథల్లో ఎక్కడో ఒక చోట అభ్యంతరకమైన విషయాలు, పెద్దలకి మాత్రమే పరిమితమయ్యే విషయాలు ఉంటాయి. అందుకే మొహమాటం లేకుండా వాటిని తిరస్కరిస్తుంటా. ఆచితూచి కథల్ని ఎంపిక చేసుకుంటూ ఏడాదికి ఒక్కటే సినిమా చేస్తుంటా. సినిమాల్లో సందేశం ఉండొచ్చు కానీ, అది హిత బోధలా ఉండకూడదు. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది. కానీ దాన్ని హాస్య ప్రధానంగానే చెప్పాం. తెలుగు నటులు అజయ్, శత్రుతోపాటు, మనీష్కాంత్, కరుణ కింగ్స్లే తదితరులు కీలక పాత్రలు పోషించారు’’.
అన్ని పరిశ్రమలు ప్రభావం చూపిస్తున్నాయి
‘‘దక్షిణాదిలో నాలుగు పరిశ్రమల నుంచి గొప్ప చిత్రాలొస్తున్నాయి. అన్ని భాషల మధ్య ఆరోగ్య కరమైన పోటీ ఉంది. ప్రతి పరిశ్రమకీ ఒక ప్రత్యేకత ఉంది. ‘బాహుబలి’తో తెలుగు సినిమానే మొదట ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్’, ‘కాంతారా’ సినిమాలతో కన్నడ, ‘విక్రమ్’, ‘పీఎస్1’తో తమిళం.. ఇలాలా అన్ని పరిశ్రమలూ ప్రభావం చూపిస్తున్నాయి. మొదట్లో నేను కంటెంట్ ప్రధానమైన సినిమాలే చేసేవాణ్ని. ‘రాత్ససన్’ నా ప్రయాణాన్ని మార్చింది. వాణిజ్య ప్రధానంగా కథల్ని చెప్పాలని నిర్ణయం తీసుకునేలా చేసింది. మలయాళం శైలి కథలు, తెలుగు సినిమాల శైలిలో వాణిజ్యాంశాలు, తమిళ చిత్రాల్లాగా సెన్సిబిలిటీస్ని మేళవించి సినిమాలు చేయాలనేదే నా ముందున్న లక్ష్యం. నా నుంచి రాబోయే చిత్రాలన్నీ అదే తరహాలో ఉంటాయి’’.
రజనీకాంత్ ‘లాల్ సలామ్’లో నటిస్తున్నా
‘‘నా భార్య జ్వాలకి నటనపై ఆసక్తి లేదు కానీ, తనకి సినిమా అంటే చాలా ఇష్టం. సినిమా చూసి తన అభిప్రాయాన్ని పక్కాగా చెబుతుంది. గత మూడు చిత్రాలు ఆమె చెప్పినట్టే ఆడాయి. తదుపరి ‘మోహన్దాస్’ అనే సినిమా చేస్తున్నా. ఆ తర్వాత సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రజనీకాంత్తో కలిసి ‘లాల్సలామ్’ చిత్రంలోనూ నటిస్తున్నా. స్వతహాగా నేను క్రికెటర్ని. క్రికెట్ నేపథ్యంలో సినిమాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ‘జీవా’ అనే చిత్రం చేశా. పక్కాగా ఓ సూపర్హీరో సినిమా చేయాలని ఉంది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’.
ఆయన తెలుగులో నేనే నటిస్తా అన్నారు
‘‘నా గత చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’ నుంచి రవితేజతో నా ప్రయాణం కొనసాగుతోంది. ఆ కథ నచ్చి విడుదలకి ముందు సమర్పకులుగా ఆ ప్రాజెక్ట్లో చేరారు. ఆ సమయంలోనే తర్వాతేమిటని అడిగారు. అప్పుడే ‘మట్టి కుస్తీ’ గురించి చెప్పా. చాలా బాగుందని నిర్మాణËంలో భాగమయ్యేందుకు ముందుకొచ్చారు. ఆ తర్వాత దర్శకుడిని పంపించా. కథ విన్నాక నన్ను పిలిచి, ‘నాకొక ఆలోచన వచ్చింది. నువ్వు ఈ కథని తమిళంలో చేయి, నేను తెలుగులో చేస్తా’ అన్నారు. లేదు సర్, మీరు ఈ సినిమాకి నిర్మాత మాత్రమే అని చెప్పా. నిజానికి ఆయన కామెడీ టైమింగ్కి ఈ కథ చాలా బాగుంటుంది. 13 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నా. ఏదైనా ఒక సినిమా చేసే ముందు నా మార్కెట్, వ్యాపారం గురించి మాట్లాడాకే మిగతా విషయాలు ప్రస్తావనకొచ్చేవి. మార్కెట్కి తగ్గట్టే ఖర్చు పెట్టేందుకు ముందుకొచ్చేవాళ్లు. రవితేజ మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మారు. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకో అని చెప్పేవారు. ఆయనకి నాపైన ఉన్న నమ్మకం నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. రవితేజకి నా మనసులో ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా