ధనుష్‌తో త్రిభాషా చిత్రం

తమిళ కథానాయకులు తెలుగు దర్శకులతోనూ... తెలుగు కథానాయకులు తమిళ దర్శకులతోనూ జట్టు కడుతున్నారు. ఈ కలయికలు ప్రేక్షకుల్లోనూ... పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Published : 29 Nov 2022 02:11 IST

మిళ కథానాయకులు తెలుగు దర్శకులతోనూ... తెలుగు కథానాయకులు తమిళ దర్శకులతోనూ జట్టు కడుతున్నారు. ఈ కలయికలు ప్రేక్షకుల్లోనూ... పరిశ్రమ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ధనుష్‌ - శేఖర్‌ కమ్ముల కలయిక కూడా ఈ జాబితాలో ఒకటి. సున్నితమైన కథాంశాలతో సినిమాల్ని తెరకెక్కిస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న శేఖర్‌ కమ్ముల... ఈసారి ధనుష్‌ కథానాయకుడిగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమిగోస్‌ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్‌, పూస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ సమర్పకులు. ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రంలో వివిధ భాషలకి చెందిన నటులు కనిపిస్తారని, కథకి తగ్గట్టుగా భారీ హంగులతో సినిమా రూపొందుతుందని చిత్రవర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని