ప్రేమకథల శీతాకాలం
సహజమైన మూడు ప్రేమకథల సమాహారమే మా చిత్రం అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా, కావ్య శెట్టి, మేఘ ఆకాష్ కథానాయికలు.
సహజమైన మూడు ప్రేమకథల సమాహారమే మా చిత్రం అన్నారు సత్యదేవ్. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. తమన్నా, కావ్య శెట్టి, మేఘ ఆకాష్ కథానాయికలు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రామారావు చింతపల్లి, భావనా రవి, నాగ శేఖర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘దర్శకుడు నాగశేఖర్ పది నిమిషాలు కథ చెప్పగానే సినిమా చేస్తానని చెప్పా. తమన్నా ఎప్పుడూ చేయని పాత్రని ఇందులో చేశారు. యువతరం ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. ‘గాడ్ఫాదర్’లో చేసిన పాత్రకి చాలా మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో పాత్ర కూడా అంతకుమించి ఆకట్టుకుంటుంది. చాలా కష్టాల్ని ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. వాణిజ్యం పరంగా పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ ‘‘ఇందులోని ప్రేమకథలు సాధారణంగా ఉండవు, ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తాయి. లక్ష్మీభూపాల్ మాటలు ఈ చిత్రాన్ని మురో స్థాయిలో నిలబెడతాయి. మా నటులు శీతాకాలం మేజిక్ని సృష్టిస్తార’’న్నారు. ఇందులోని ఓ మంచి పాత్రో నవ్విస్తానని చెప్పారు ప్రియదర్శి. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు ఎం.సుబ్బారెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత నవీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా