Jai Bhim: ‘జై భీమ్‌’కు సీక్వెల్‌?

సూర్య ప్రధాన పాత్రలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘జై భీమ్‌’. విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాదు పలు పురస్కారాలను ఈ చిత్రం గెలుచుకుంది.

Updated : 01 Dec 2022 11:32 IST

సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘జై భీమ్‌’ (Jai Bhim). విమర్శకులు ప్రశంసలు అందుకోవడమే కాదు పలు పురస్కారాలను ఈ చిత్రం గెలుచుకుంది. న్యాయవాది కె.చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ తీసే ఆలోచనలో చిత్ర నిర్మాత రాజశేఖర్‌ పాండియన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘జై భీమ్‌ని ఓ ప్రాంచైజీగా మార్చడానికి చర్చలు జరిగాయి. కె.చంద్రు జీవితంలోని మరో కొత్త ఎపిసోడ్‌ని రెండో చిత్రంలో చూపించబోతున్నాం’’ అని నిర్మాత చెప్పినట్లు సమాచారం. తను అనుకున్న కథను పూర్తిస్థాయి స్క్రిప్టుగా మార్చే పనిలో ఉన్నారట దర్శకుడు జ్ఞానవేల్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని