Cinema News: సినీ ముచ్చట్లు.. కొత్త సినిమా విశేషాలు
‘రాధే’ తర్వాత సల్మాన్ఖాన్ నుంచి వస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. కరోనా సమయంలో విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో చూడలేకపోయారు. దాంతో ‘కిసీ కా భాయ్...’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.
భాయ్ లుంగీ డ్యాన్స్
‘రాధే’ తర్వాత సల్మాన్ఖాన్ (Salman Khan) నుంచి వస్తోన్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). కరోనా సమయంలో విడుదల కావడంతో ప్రేక్షకులు థియేటర్లలో చూడలేకపోయారు. దాంతో ‘కిసీ కా భాయ్...’ చిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. వచ్చే ఏడాది ఈద్ కానుకగా రానున్న ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు సల్మాన్ఖాన్. ఇటీవల సల్మాన్పై చిత్రీకరించిన పాట ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ పాటలో సల్మాన్ లుంగీ ధరించి వేసిన స్టెప్పులు మాస్ని అలరిస్తాయని సమచారం. పూజా హెగ్డే (Pooja Hegde) కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భూమిక, భాగ్యశ్రీలు కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సల్మాన్ ‘టైగర్ 3’తో ప్రేక్షకుల్ని అలరించనున్నారు.
పారిశుద్ధ్య కార్మికుల కష్టాలపై పోరు
ఆధునిక విధానాలు అందబాటులోకి వచ్చినప్పటికీ... నేటికీ మురుగు కాల్వలు శుభ్రం చేసే పనిలో ఎంతోమంది పేద కార్మికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ సమస్యని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమే ‘విట్నెస్’ (Witness). శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగరాజా, అజగం పెరుమాళ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఛాయాగ్రాహకుడు దీపక్ దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్ నిర్మాత. ఈ నెల 9న తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీ వేదిక ద్వారా రానుందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రవర్గాలు మాట్లాడుతూ ‘‘పార్తిబన్ అనే కుర్రాడు ఓ అపార్ట్మెంట్లో సెప్టిక్ ట్యాంక్ని శుభ్రం చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందా లేదా అనేదే ఈ చిత్రకథ. పారిశుద్ధ్య కార్మికుల కష్టాల్ని కళ్లకు కట్టినట్టు చూపించామ’’ని తెలిపాయి.
కొత్త చిత్రానికి శ్రీకారం
కథానాయకుడు సాయితేజ్ (Saidharam Tej) నుంచి ఓ కొత్త కబురు వినిపించింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని ద్వారా జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్ కొట్టారు. నిర్మాత బాపినీడు భోగవల్లి కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘సాయితేజ్తో మా సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఈ సినిమా రూపొందించనున్నాం. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు.
అన్యాయంపై పోరాటం
రామ్ తేజ్, గరిమ జంటగా అజయ్ కృష్ణ నల్ల (Ajay Krishna) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. పీవీఆర్ నిర్మాత. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టగా.. రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు అజయ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘‘మీడియా నేపథ్యంలో సాగే చిత్రమిది. సమాజంలో జరుగుతోన్న అన్యాయాలు, అక్రమాలను ఓ సామాన్య యువకుడు ఎలా ఎదుర్కొన్నాడన్నది చిత్ర కథాంశం. ఇందులో మంచి సందేశం ఉంది. త్వరలో చీరాలలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ సినిమాకి సంగీతం: రాజా, ఛాయాగ్రహణం: శబరినాథ్.
కథ వెనుక మరో కథ
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభ శ్రీ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’ (Katha Venuka Katha). కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్నారు. దండమూడి అవనింద్ర కుమార్ నిర్మాత. సునీల్, అలీ, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్లుక్ను ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వంత్ మాట్లాడుతూ.. ‘‘ఈ టైటిల్ వెనుక ఎన్నో కథలున్నాయి. ఈ సినిమాతో గట్టిగా కొట్టబోతున్నాం. దీని కోసం అందరం ఎంతో కష్టపడ్డాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో చాలా కథలుంటాయి. స్క్రీన్ప్లే కొత్తగా ఉంటుంది. ఇందులో నేను ఓ శక్తిమంతమైన పాత్రలో కనిపిస్తా’’ అన్నారు నటుడు సునీల్. దర్శకుడు కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఇంత భారీ స్థాయిలో తీశామంటే దానికి కారణం నిర్మాత అందించిన సహకారమే’’ అన్నారు. ‘‘చాలా మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు నటుడు అలీ. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, ఆర్పీ పట్నాయక్, రఘుబాబు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్వర్మ పంచుకున్నారు. -
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్లో తన కెరీర్కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మలయాళ చిత్రం ‘నాయట్టు’ ఇప్పుడు తెలుగు ఆడియోతో అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!